రైలు ఎక్కాలంటే ఈ నిబంధనలు తప్పనిసరి…
ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేందుకు ఇప్పటి వరకు దాదాపు 80,000 మంది పాసింజర్స్ రూ.16 కోట్లు విలువైన టికెట్లు బుక్ చేసుకున్నారని భారతీయ రైల్వే తెలిపింది. ఫస్ట్ స్పెషల్ ట్రైన్ న్యూ ఢిల్లీ స్టేషన్ నుంచి మధ్యప్రదేశ్లోని బిలాస్పుర్కు బయలుదేరాల్సిన కొన్ని గంటల ముందు రైల్వే ఈ ప్రకటన చేసింది. ఈ స్పెషల్ ట్రైన్స్ టికెట్ బుకింగ్ సోమవారం సాయంత్రం 6 గంటలకు స్టార్టయ్యింది. రానున్న ఏడు రోజులకు ఇప్పటి వరకు రూ.16.15 కోట్ల విలువైన 45,533 బుకింగ్లు […]
ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేందుకు ఇప్పటి వరకు దాదాపు 80,000 మంది పాసింజర్స్ రూ.16 కోట్లు విలువైన టికెట్లు బుక్ చేసుకున్నారని భారతీయ రైల్వే తెలిపింది. ఫస్ట్ స్పెషల్ ట్రైన్ న్యూ ఢిల్లీ స్టేషన్ నుంచి మధ్యప్రదేశ్లోని బిలాస్పుర్కు బయలుదేరాల్సిన కొన్ని గంటల ముందు రైల్వే ఈ ప్రకటన చేసింది. ఈ స్పెషల్ ట్రైన్స్ టికెట్ బుకింగ్ సోమవారం సాయంత్రం 6 గంటలకు స్టార్టయ్యింది. రానున్న ఏడు రోజులకు ఇప్పటి వరకు రూ.16.15 కోట్ల విలువైన 45,533 బుకింగ్లు (పీఎన్ఆర్లు) అయ్యాయి. ఫలితంగా 82,317 మంది తమ సొంత ఊర్లకు చేరుకోనున్నారు.
దాదాపు యాభై రోజుల విరామం తర్వాత రెగ్యులర్ పాసింజర్ రైళ్లు (15 ప్రత్యేక రైళ్లు) మంగళవారం నుంచి పట్టాలు ఎక్కనున్నాయి. ఈ రైళ్ల ప్రయాణానికి సంబంధించిన కొత్త మార్గదర్శకాల్ని రైల్వేశాఖ అనౌన్స్ చేసింది. పాసింజర్స్ మెడికల్ టెస్టుల కోసం 90 నిమిషాలు ముందుగా స్టేషన్కు చేరుకోవాలి. ముఖాలకు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. ఫుడ్, వాటర్ వెంట తెచ్చుకోవాలి. పాసింజర్స్ తమ మొబైల్లో తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. కరోనా సంక్షోభం సమయంలో ఈ రైళ్లను నడుపుతున్నందు వల్ల సర్టిఫైడ్ ఈ-టికెట్ ఉన్న పాసింజర్స్ మాత్రమే ఈ స్టేషన్లలోకి అనుమతిస్తారు. ప్రయాణికులు ఏడు రోజుల ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. అయితే ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్, ఆన్బోర్డ్ బుకింగ్లను అనుమతించరు.