చిక్కుల్లో కొండా… బెయిల్కి కోర్టు నో…
తెలంగాణ కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డికి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఈరోజు తిరస్కరించింది. ఇటీవల ఎన్నికల సందర్భంగా గచ్చిబౌలి ప్రాంతంలో తనిఖీల్లో దొరికిన రూ.10 లక్షల విషయమై నోటీసులు ఇచ్చేందుకు గచ్చిబౌలి ఎస్ఐ తన సిబ్బందితో విశ్వేశ్వరరెడ్డి కార్యాలయానికి వెళ్లారు. కానీ అక్కడ ఆయన తన అనుచరులతో పోలీసులను నిర్బంధించారు. అంతేకాకుండా ఎస్ఐని దూషించారు. ఈ వ్యవహారంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఈ […]
తెలంగాణ కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డికి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఈరోజు తిరస్కరించింది. ఇటీవల ఎన్నికల సందర్భంగా గచ్చిబౌలి ప్రాంతంలో తనిఖీల్లో దొరికిన రూ.10 లక్షల విషయమై నోటీసులు ఇచ్చేందుకు గచ్చిబౌలి ఎస్ఐ తన సిబ్బందితో విశ్వేశ్వరరెడ్డి కార్యాలయానికి వెళ్లారు. కానీ అక్కడ ఆయన తన అనుచరులతో పోలీసులను నిర్బంధించారు. అంతేకాకుండా ఎస్ఐని దూషించారు. ఈ వ్యవహారంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో కొండా ముందస్తు బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు దాన్ని తిరస్కరించింది.