AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజధాని అయినా ఇవ్వండి.. రాష్ట్రం అయినా ఇవ్వండి!

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కర్నూలు రాజధానిని త్యాగం చేశాం, ప్రధాన రాజధాని కర్నూలులో పెట్టాల్సిందే… లేదంటే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండని మైసూరా రెడ్డి డిమాండ్ చేశారు. నీరు ఇవ్వరు, నిధులు ఇవ్వరు, రాజధాని ఇవ్వరు ఇంకా ఎందుకు మీతో కలిసి ఉండాలి అని ఆయన  మండిపడ్డారు. రాయలసీమకు రాజధాని అనే నేతలు, సంఘాలతో కలిసి పనిచేస్తామని, క్యాబినెట్ నిర్ణయం తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తామని మైసూరా స్పష్టంచేశారు. ప్రభుత్వ భూములు ఉన్న రాయలసీమను వదిలేసి వేరే […]

రాజధాని అయినా ఇవ్వండి.. రాష్ట్రం అయినా ఇవ్వండి!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 26, 2019 | 5:48 AM

Share

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కర్నూలు రాజధానిని త్యాగం చేశాం, ప్రధాన రాజధాని కర్నూలులో పెట్టాల్సిందే… లేదంటే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండని మైసూరా రెడ్డి డిమాండ్ చేశారు. నీరు ఇవ్వరు, నిధులు ఇవ్వరు, రాజధాని ఇవ్వరు ఇంకా ఎందుకు మీతో కలిసి ఉండాలి అని ఆయన  మండిపడ్డారు. రాయలసీమకు రాజధాని అనే నేతలు, సంఘాలతో కలిసి పనిచేస్తామని, క్యాబినెట్ నిర్ణయం తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తామని మైసూరా స్పష్టంచేశారు.

ప్రభుత్వ భూములు ఉన్న రాయలసీమను వదిలేసి వేరే చోట రాజధాని ఎందుకు? గతంలో అమరావతి లో ల్యాండ్ పూలింగ్ పేరుతో ట్రేడింగ్ చేశారు. ఇప్పుడు కూడా వైజాగ్ రాజధాని పేరుతో ట్రేడింగ్ జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో రాజధాని పెడితే రాయలసీమ ప్రజలకు అందుబాటులో ఉండదని మైసూరా రెడ్డి వివరించారు. రాయలసీమలో రాజధాని డిమాండ్ ఇప్పటిది కాదని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఇద్దరు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారే అయినా ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని మైసూరా వాపోయారు.