రాజస్థాన్‌లో 15వేలకు చేరువైన కరోనా కేసులు..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. రాజస్థాన్‌లో నేడు దాదాపు 400 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15వేలకు

రాజస్థాన్‌లో 15వేలకు చేరువైన కరోనా కేసులు..
Follow us

| Edited By:

Updated on: Jun 21, 2020 | 10:03 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. రాజస్థాన్‌లో నేడు దాదాపు 400 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15వేలకు చేరుకుంది. ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 393 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12 మంది మరణించారు. 323 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 14,930కు చేరింది. వీరిలో 2,984మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 11,355మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 349మంది ప్రాణాలు కోల్పోయారు.