AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మెగాస్టార్ బుక్’ లాంచ్‌లో చెర్రీ ఎమోషనల్ స్పీచ్.. సమయం దొరికితే మాతోనే..

ఆయన గురించి చెప్పాలంటే.. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాకి ముందు.. ఆ తర్వాత అనే చెప్పాలి. ఎందుకంటే.. మా చిన్నప్పుడు ఆయన్ని చూసింది.. మాట్లాడింది చాలా తక్కువ. మేము లేవకముందే వెళ్లిపోయేవారు..

'మెగాస్టార్ బుక్' లాంచ్‌లో చెర్రీ ఎమోషనల్ స్పీచ్.. సమయం దొరికితే మాతోనే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 01, 2020 | 9:43 PM

Share

చిరంజీవి అంటే ప్రపంచ వ్యాప్తంగా తెలియని వారుండరు. అంతలా అభిమానులను సంపాదించుకున్న క్రేజ్ ఆయన సొంతం. తాజాగా ఆయన పేరు మీద బుక్ రాసిన సంగతి తెలిసిందే. మార్చి 1వ తేదీ ఆదివారం ఈ బుక్‌ని టాలీవుడ్ పెద్దల సమక్షంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆవిష్కరించారు. ‘మెగాస్టార్ ది లెజెండ్ బుక్’ కార్యక్రమం ది పార్క్ హయత్ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పటికే చిరంజీవి మీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి ఎందరో సూపర్ స్టార్స్ ఉన్న సమయం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ స్వశక్తితో ఎదుగుతూ వచ్చారు చిరంజీవి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ఫ్యాన్స్ అభిమానాన్ని సంపాదించుకున్న చిరు మీద.. ‘మెగాస్టార్ ది లెజెండ్’ పేరుతో సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు తాజాగా ఓ పుస్తకం రాశారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. ఆయన గురించి చెప్పాలంటే.. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాకి ముందు.. ఆ తర్వాత అనే చెప్పాలి. ఎందుకంటే.. మా చిన్నప్పుడు ఆయన్ని చూసింది.. మాట్లాడింది చాలా తక్కువ. మేము లేవకముందే వెళ్లిపోయేవారు.. మేము పడుకున్నాకే వచ్చేవారు. అంతలా ఆయన కష్టపడేవారు. కానీ అప్పుడు మాకు తెలిసేది కాదు. కానీ నాన్నతో ‘ఖైదీ నెంబర్ 150’ చేశాకే.. అర్థమయ్యింది. ఆయన మా కోసం ఎంత కష్ట పడ్డారన్నది. 64 ఏళ్ల వయస్సులో కూడా.. రూపాయి రెమ్యునరేషన్ తీసుకోకుండా.. ఆయన సైరా సినిమా చేశారు.

ఆయన గురించి నాకు ఎన్నో తెలుసు అనుకున్నా.. కానీ.. నాకు చాలా కొంతనే తెలుసు. కనీసం ఈ బుక్ చదివిన తర్వాత.. నాన్నకి ఇంకా దగ్గర అవుతా అనుకుంటున్నా. మా అమ్మని, మమ్మల్ని దగ్గర పెట్టుకుని ఒకటే చెబుతూంటారు. ఇప్పుడు మీతో ఎక్కువ సమయం గడపాలని ఉందని. అందుకే అన్ని సెలబ్రేషన్స్ ఇంటిలోనే చేసుకుంటున్నామని చెప్పాడు చెర్రీ. కాగా ఈ కార్యక్రమంలో.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు, మురళీ మోహన్, బి సుబ్బిరామి రెడ్డి, అల్లు అరవింద్, వివి వినాయక్, రామ్ చరణలు తదితరులు పాల్గొన్నారు.