AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నక్సలైట్ల దాడిలో బీజేపీ ఎమ్మెల్యే మృతి

ఛత్తీస్​గఢ్​లో నక్సలైట్లు  హింసకు పాల్పడ్డారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్​ను బహిష్కరించాలని కొంతకాలంగా ప్రకటనలు జారీచేస్తున్న నక్సలైట్లు..తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు.  దంతెవాడ శాసనసభ్యుడు భీమా మండావి సహా మరో ఐదుగురిని బలిగొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే భీమా మండావి వాహనం కువకొండ నుంచి బచేలివైపు వెళ్తుండగా నక్సలైట్లు దాడికి తెగబడ్డారు. శ్యామగిరి పర్వతాల సమీపంలో డేంజరస్ ఐఈడీ పేల్చారు. ఈ దాడిలో ఎమ్మెల్యే, ఐదుగురు భద్రతా సిబ్బంది అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే భద్రతా […]

నక్సలైట్ల దాడిలో బీజేపీ ఎమ్మెల్యే మృతి
Ram Naramaneni
|

Updated on: Apr 09, 2019 | 7:12 PM

Share

ఛత్తీస్​గఢ్​లో నక్సలైట్లు  హింసకు పాల్పడ్డారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్​ను బహిష్కరించాలని కొంతకాలంగా ప్రకటనలు జారీచేస్తున్న నక్సలైట్లు..తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు.  దంతెవాడ శాసనసభ్యుడు భీమా మండావి సహా మరో ఐదుగురిని బలిగొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే భీమా మండావి వాహనం కువకొండ నుంచి బచేలివైపు వెళ్తుండగా నక్సలైట్లు దాడికి తెగబడ్డారు. శ్యామగిరి పర్వతాల సమీపంలో డేంజరస్ ఐఈడీ పేల్చారు. ఈ దాడిలో ఎమ్మెల్యే, ఐదుగురు భద్రతా సిబ్బంది అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే భద్రతా బలగాలతో ఘటనా స్థలాన్ని స్వాధీనంలోకి తీసుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఛత్తీస్​గఢ్​లో తొలిదశలో బస్తర్​ స్థానానికి గురువారం పోలింగ్​ జరగనుంది. అందుకు కొద్ది గంటల ముందు అదే నియోజకవర్గం పరిధిలోని దంతెవాడ శాసనసభ్యుడ్ని నక్సలైట్లు హత్యచేయడం కలకలం రేపింది.