IPL 2020 : మూడు వేల పరుగులు క్లబ్లో చేరిన మనీశ్ పాండే
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మన్ మనీశ్ పాండే 3వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. దుబాయ్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన అతడు ఈ ఫీట్ అందుకున్నాడు.
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మన్ మనీశ్ పాండే 3వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. దుబాయ్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన అతడు ఈ ఫీట్ అందుకున్నాడు. టోర్నీలో 3 వేల రన్స్ మైలురాయిని చేరిన ఆటగాళ్ల లిస్ట్లో 16వ క్రికెటర్గా పాండే నిలిచాడు. ఐపీఎల్లో సెంచరీ చేసిన తొలి ఇండియన్ ప్లేయర్గానూ మనీశ్ పేరిట రికార్డుంది. 2009 సీజన్లో ఆర్సీబీ తరుపున ఆడిన పాండే.. 73 బంతుల్లో 114 పరుగులు చేశాడు. గతేడాది ఐపీఎల్లో ఆడిన 12 మ్యాచ్ల్లో 43 సగటుతో 344 రన్స్ చేశాడు. ( Bigg Boss Telugu 4 : హౌస్ నుంచి సుజాత్ ఔట్ !..రీజన్స్ ఇవే ! )
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్ ప్లేసులో ఉన్నాడు. ఆ తర్వాత వరుసగా సురేశ్ రైనా, రోహిత్ శర్మ ఉండగా.. సన్రైజర్స్ హైదరాబాద్ సారథి డేవిడ్ వార్నర్ నాలుగోస్థానంలో కొనసాగుతున్నాడు.
????????? ????? ?
MAN like Manish Pandey ?#SRHvRR #OrangeArmy #KeepRising pic.twitter.com/eIdPHoKGID
— SunRisers Hyderabad (@SunRisers) October 11, 2020