అదృశ్యమైన ఆరు నెలల తర్వాత.. తిరిగి కుటుంబం చెంతకు.. 

ఢిల్లీలో అల్జీమర్స్ తో బాధపడుతున్న 85 ఏళ్ల వృద్ధుడు ఇంటి నుంచి అదృశ్యమైన ఆరు నెలల తర్వాత తిరిగి కుటుంబం చెంతకు చేరుకున్నాడు. ఆగ్నేయ ఢిల్లీలోని గోవిందపురి ప్రాంతానికి చెందిన

అదృశ్యమైన ఆరు నెలల తర్వాత.. తిరిగి కుటుంబం చెంతకు.. 
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2020 | 10:38 PM

Man Reunites With Family: ఢిల్లీలో అల్జీమర్స్ తో బాధపడుతున్న 85 ఏళ్ల వృద్ధుడు ఇంటి నుంచి అదృశ్యమైన ఆరు నెలల తర్వాత తిరిగి కుటుంబం చెంతకు చేరుకున్నాడు. ఆగ్నేయ ఢిల్లీలోని గోవిందపురి ప్రాంతానికి చెందిన తన తండ్రి దేవ్ నారాయణ్ ఝా కనిపించకుండా పోయాడంటూ ఆయన కుమారుడు ప్రభాకర్ ఝా ఈ ఏడాది జనవరి 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, మనుషుల అక్రమ రవాణా వ్యతిరేక విభాగానికి సంగం విహార్ ప్రాంతంలో ఓ వృద్ధుడు చాలా కాలంగా ఉంటున్నట్టు సమాచారం అందింది.

కాగా.. హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసు బృందం  నారాయణ్ ఝా ఫొటోను అక్కడికి వారికి చూపించి గుర్తిస్తే చెప్పాలని సూచించింది. ఈ క్రమంలో శనివారం సంగం విహార్ ప్రాంతంలో ఉన్న వృద్ధుడిని గుర్తించి ఇంటికి తీసుకెళ్లి అప్పగించినట్టు డీసీపీ (సౌత్ ఈస్ట్) ఆర్‌పీ మీనా తెలిపారు.

Also Read: ఫలించిన చర్చలు.. స్వదేశానికి 367 మంది భారతీయులు..!