AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్ర లో కొనసాగుతున్న కరోనా కల్లోలం

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతుంది. నిత్యం పెరుగుతున్న కేసులతో జనం బెంబేలెత్తుతున్నారు. అటు అత్యధిక కేసుల నమోదవుతున్న మహారాష్ట్రలో అదే స్థాయిలో కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ సోమవారం కొత్తగా 7,924 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఈ రోజు 227 మంది కరోనాతో ప్రాణాలొదిలారు.

మహారాష్ట్ర లో కొనసాగుతున్న కరోనా కల్లోలం
Balaraju Goud
|

Updated on: Jul 27, 2020 | 8:40 PM

Share

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతుంది. నిత్యం పెరుగుతున్న కేసులతో జనం బెంబేలెత్తుతున్నారు. అటు అత్యధిక కేసుల నమోదవుతున్న మహారాష్ట్రలో అదే స్థాయిలో కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ సోమవారం కొత్తగా 7,924 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఈ రోజు 227 మంది కరోనాతో ప్రాణాలొదిలారు. మహారాష్ట్ర లో ఇప్పటివరకు మొత్తంగా మృతుల సంఖ్య 13883కి చేరుకుంది. ఇక, ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 3,83,723 మంది కరోనా బారిన పడగా, అందులో 1,47,592 మంది రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక, కరోనా నుంచి కోలుకున్న 2,21,944 మంది బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు, రాబోయే రోజుల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు.