కరోనా ఎఫెక్ట్: జులై 2021 వరకు గూగుల్ లో వర్క్ ఫ్రం హోం..!
కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో చాలా కంపెనీలు ఉద్యోగుల భద్రత కోసం వర్క్ ఫ్రం హోం సౌలభ్యాన్ని కల్పించాయి. తాజాగా గూగుల్ ఈ సౌలభ్యాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో చాలా కంపెనీలు ఉద్యోగుల భద్రత కోసం వర్క్ ఫ్రం హోం సౌలభ్యాన్ని కల్పించాయి. తాజాగా గూగుల్ ఈ సౌలభ్యాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు పొడిగించినట్టు సమాచారం. 2021 జులై వరకూ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు గూగుల్ నిర్ణయించిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ నిర్ణయం ద్వారా.. గూగుల్లో పనిచేస్తున్న రెండు లక్షల పైచిలుకు ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది లాభపడనున్నారని సమాచారం.
కరోనా సంక్షోభం పై కంపెనీలో గత వారం విస్తృత చర్చ జరిగిన అనంతరం సీఈఓ సుందర్ పిచాయ్ స్వయంగా వర్క్ ఫ్రం హోం గడువును పొడిగించేందుకు నిర్ణయించారట. అయితే గూగుల్ మాత్రం ఈ విషయమై అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఈ వార్త రూఢీ అయితే..వర్క్ ఫ్రం హోంను ఈ స్థాయిలో పొడిగించిన తొలి కంపెనీ గూగుల్ అవుతుందని పరిశీలకులు చెబుతున్నారు.
Read More:
గుడ్ న్యూస్: సప్లిమెంటరీ, బ్యాక్లాగ్ విద్యార్థులకు పాస్ మార్కులు..
గుడ్ న్యూస్: ఇక కామర్స్, ఆర్ట్స్ విద్యార్థులకూ ‘గేట్’ రాసే అవకాశం..!