AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్ర సర్కార్ పై సంబిత్ పాత్ర సంచలనవ్యాఖ్యలు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు రాజకీయాల్లోనూ దుమారం రేపుతోంది. త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వం అధికారం కూడా కోల్పోతుందని బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర జోస్యం చెప్పారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన స్వాగతించారు.

మహారాష్ట్ర సర్కార్ పై సంబిత్ పాత్ర సంచలనవ్యాఖ్యలు
Balaraju Goud
|

Updated on: Aug 19, 2020 | 4:46 PM

Share

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు రాజకీయాల్లోనూ దుమారం రేపుతోంది. త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వం అధికారం కూడా కోల్పోతుందని బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర జోస్యం చెప్పారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన స్వాగతించారు. అంతేకాదు, మహారాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకూ మొద్దునిద్ర పోతున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గగ్గోలు పెడుతోందని ఎద్దేవా చేశారు.

మహారాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని.. అటు, సుశాంత్ ఫ్యామిలీపై సంజయ్ రౌత్ విమర్శలకు దిగారు. ఇప్పుడు ప్రభుత్వం రోదనలు చేస్తోంది. మిత్రులారా, త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఇంటిదారి పట్టిందనే వార్త మనం వింటాం’ అంటూ సంబిత్ పాత్ర ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. మహా వికాస్ అఘాడి ప్రభుత్వంపై మరిన్ని వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తూ… శివసేన=సోనియా+రియా=సోరియా సేన (నిద్రపోతున్న సేన) అని ఆయన వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ప్రభుత్వం పక్షపాత ధోరణికి సుప్రీంకోర్టు తీర్పుతో పెద్ద దెబ్బ తగిలిందని అన్నారు. సుశాంత్ మరణంపై సీబీఐ విచారణలో అసలు విషయాలు బయటకువస్తాయని సంబిత్ పాత్ర పేర్కొన్నారు.