AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా.. అజిత్ పవార్ బంపర్ మెజార్టీ..80 శాతం ఓట్లు..ఇది ఏడోసారి..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ నేత, శరద్ పవార్ బంధువు అజిత్ పవార్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. పుణే జిల్లా బారామతి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన.. బీజేపీ అభ్యర్థి గోపీచంద్ పడాల్కర్‌పై 1.65 లక్షల ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు. పోలైన ఓట్లలో దాదాపు 80 శాతం పైచిలుకు అజిత్ పవార్‌కే రావడంతో ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీ నేత డిపాజిట్లు కోల్పోయాడు. అజిత్ పవార్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ఇది ఏడోసారి. పార్టీలో […]

వారెవ్వా.. అజిత్ పవార్ బంపర్ మెజార్టీ..80 శాతం ఓట్లు..ఇది ఏడోసారి..
Ram Naramaneni
| Edited By: |

Updated on: Oct 24, 2019 | 7:41 PM

Share
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ నేత, శరద్ పవార్ బంధువు అజిత్ పవార్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. పుణే జిల్లా బారామతి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన.. బీజేపీ అభ్యర్థి గోపీచంద్ పడాల్కర్‌పై 1.65 లక్షల ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు. పోలైన ఓట్లలో దాదాపు 80 శాతం పైచిలుకు అజిత్ పవార్‌కే రావడంతో ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీ నేత డిపాజిట్లు కోల్పోయాడు.
అజిత్ పవార్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ఇది ఏడోసారి. పార్టీలో మంచి పట్టున్న నేతగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఈ ఏడాది మొదట్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్‌కు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఉపముఖ్యమంత్రిగా పనిచేయడంతో పాటు ఆయన వివిధ శాఖలకు మంత్రిగా కూడా పనిచేశారు. కాగా అజిత్ పవార్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్న కొడుకు అన్న విషయం తెలిసిందే.