AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ రైతులకు తీపికబురు.. ‘మిడతల దండు’ రూట్ మారింది.!

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో తిష్టవేసిన మిడతల దండు మధ్యప్రదేశ్ వైపు వెళ్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. గురువారం రాష్ట్రానికి 400కిలోమీటర్ల దూరంలోని విదర్భ ప్రాంతలో తిష్టవేసిన మిడతల దండు గాలివాటం ఆధారంగా నిన్న మధ్యాహ్నం దిశను మార్చుకుని మధ్యప్రదేశ్ వైపు మరిలిపోతున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అంచనా వేశారు. దీనితో రైతులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాకుండా మిడతల దండు ప్రస్తుతం తెలంగాణలోకి ప్రవేశించలేదని స్పష్టం చేశారు. కాగా, గాలిదిశ మార్చుకుని మళ్లీ […]

తెలంగాణ రైతులకు తీపికబురు.. 'మిడతల దండు' రూట్ మారింది.!
Ravi Kiran
|

Updated on: May 30, 2020 | 3:50 PM

Share

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో తిష్టవేసిన మిడతల దండు మధ్యప్రదేశ్ వైపు వెళ్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. గురువారం రాష్ట్రానికి 400కిలోమీటర్ల దూరంలోని విదర్భ ప్రాంతలో తిష్టవేసిన మిడతల దండు గాలివాటం ఆధారంగా నిన్న మధ్యాహ్నం దిశను మార్చుకుని మధ్యప్రదేశ్ వైపు మరిలిపోతున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అంచనా వేశారు. దీనితో రైతులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

అంతేకాకుండా మిడతల దండు ప్రస్తుతం తెలంగాణలోకి ప్రవేశించలేదని స్పష్టం చేశారు. కాగా, గాలిదిశ మార్చుకుని మళ్లీ ఇటు వైపు వస్తాయా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని.. తెలంగాణకు వచ్చే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు అన్నారు. అయితే ఒకవేళ అవి దిశ మార్చుకుని ఇటు వైపు వచ్చినా వాటిని సంహరించేందుకు.. సరిహద్దుల్లో రసాయనాలు, అగ్నిమాపక యంత్రాలను ఇప్పటికే సిద్దం చేసి ఉంచామని అధికారులు వెల్లడించారు.కాగా, మిడతల దండును సంహరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Also Read: భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి హైదరాబాద్‌లో శ్రీవారి లడ్డూ అమ్మకాలు..!