AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రంగారెడ్డి జిల్లాలో మరోసారి కనిపించిన చిరుత

రంగారెడ్డి జిల్లా చిరుత సంచారం కలకలం రేపింది. యాచారం మండలంలో కొత్తపల్లి, మేడిపల్లి, నందివనపర్తి, తాడిపర్తి అటవీ ప్రాంతాల్లో చిరుత కలకలం రేపుతోంది. పశువులపై, మేకల మంద పై దాడులకు పాల్పడుతుండడంతో  ఆ ప్రాంత రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. యాచారం మండలం కొత్తపల్లి దామోదర రెడ్డి అనే రైతు వ్యవసాయ బావి వద్ద పశువుల మందలో గేదె దూడపై దాడి చేసి చంపేసింది. గత ఆరు నెలల క్రితం ఈ ప్రాంతంలో చిరుత దాడులు పెరిగాయి. […]

రంగారెడ్డి జిల్లాలో మరోసారి కనిపించిన చిరుత
Sanjay Kasula
|

Updated on: Jul 11, 2020 | 9:42 PM

Share

రంగారెడ్డి జిల్లా చిరుత సంచారం కలకలం రేపింది. యాచారం మండలంలో కొత్తపల్లి, మేడిపల్లి, నందివనపర్తి, తాడిపర్తి అటవీ ప్రాంతాల్లో చిరుత కలకలం రేపుతోంది. పశువులపై, మేకల మంద పై దాడులకు పాల్పడుతుండడంతో  ఆ ప్రాంత రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

యాచారం మండలం కొత్తపల్లి దామోదర రెడ్డి అనే రైతు వ్యవసాయ బావి వద్ద పశువుల మందలో గేదె దూడపై దాడి చేసి చంపేసింది. గత ఆరు నెలల క్రితం ఈ ప్రాంతంలో చిరుత దాడులు పెరిగాయి. మేకలు, దూడలను పొట్టనపెట్టుకుంటున్నది. మళ్ళీ ఆరు నెలల తరువాత మళ్ళీ చిరుత దాడులు చేస్తుండటం భయాందోళనకు గురవుతున్నారు.

చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు నాలుగు బోన్​లు ఏర్పాటు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. వ్యవసాయ పనులకు వెళ్లంటే రైతులు వణికిపోతున్నారు.