ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లుపై అసెంబ్లీలో సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చించారు. పేద విద్యార్థుల బ్రతుకులు బాగుపడడానికే సర్కారీ బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టామన్నారు . పేదవారికి రైట్ టు ఎడ్యుకేషన్ కాదని.. రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ను తీసుకురావడమే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. అయితే వారి న్యాయం చేయాలని చూస్తుంటే.. ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియంతో విద్యార్థుల భవిష్యత్కు పునాది పడుతుందన్నారు. మంచి జీతాలు ఇచ్చే ఉద్యోగాలు రావాలంటే ఇంగ్లిష్ మీడియం చదువు చాలా అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గతంలోనే ఈ బిల్లుకు ఆమోదం లభించగా.. మండలి తిరస్కరిస్తూ పలు సవరణలను సూచించిన సంగతి తెలిసిందే. అయితే మండలి చేసిన సవరణలను తిరస్కరిస్తూ ఈ బిల్లును మరోసారి అసెంబ్లీ ఆమోదించింది.
ఇంగ్లీష్ మీడియం బిల్లుపై సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే…