AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీజీ… మీకే మా మద్దతు: కాశ్మీరీ పండిట్లు

అమెరికాలోని హూస్టన్ లో జరిగే హౌడీ మోదీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీని అక్కడ నివాసముంటున్న కాశ్మీరీ పండిట్లు కలిశారు. సరికొత్త కాశ్మీర్ ఆవిర్భావానికి బాసటగా నిలుస్తామని వారు ఆయనకు తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారనీ.. మనమందరం నవ కాశ్మీరం నిర్మిద్దామని ప్రధాని నరేంద్ర మోదీ కాశ్మీరీ పండిట్లతో అన్నారు. కాశ్మీరీ పండిట్ సురీందర్ కౌల్ మోదీతో భేటీకి సంబంధించిన విషయాలను వెల్లడించారు. జమ్మూకాశ్మీర్ అభివృద్ధి కోసం ప్రధాని మోడీ ఏ […]

మోదీజీ... మీకే మా మద్దతు: కాశ్మీరీ పండిట్లు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 22, 2019 | 4:50 PM

Share

అమెరికాలోని హూస్టన్ లో జరిగే హౌడీ మోదీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీని అక్కడ నివాసముంటున్న కాశ్మీరీ పండిట్లు కలిశారు. సరికొత్త కాశ్మీర్ ఆవిర్భావానికి బాసటగా నిలుస్తామని వారు ఆయనకు తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారనీ.. మనమందరం నవ కాశ్మీరం నిర్మిద్దామని ప్రధాని నరేంద్ర మోదీ కాశ్మీరీ పండిట్లతో అన్నారు. కాశ్మీరీ పండిట్ సురీందర్ కౌల్ మోదీతో భేటీకి సంబంధించిన విషయాలను వెల్లడించారు.

జమ్మూకాశ్మీర్ అభివృద్ధి కోసం ప్రధాని మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా తాము మద్దతుగా ఉంటామని కాశ్మీరీ పండిట్లు ప్రధానికి చెప్పినట్లు తెలిపారు. కాశ్మీరీ పండిట్ల తరపున ప్రధానికి వినతి పత్రం సమర్పించామని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకాశ్మీర్ ప్రగతి కోసం మోదీ  నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రపంచ వ్యాప్తంగా 7 లక్షల మంది కాశ్మీరీ పండిట్ల తరపున ధన్యవాదాలు తెలిపామని వివరించారు. కాశ్మీర్ ను శాంతియుత ప్రాంతంగా మార్చి అక్కడి ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలనే ప్రధాని మోదీ కల నెరవేరేందుకు తాము కూడా సహకరిస్తామని ఈ భేటీలో కాశ్మీరీ పండిట్లు స్పష్టం చేశారు.