AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో కార్తీక శోభ

తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల కార్తీకమాసం. చంద్రుడు కృత్తికా నక్షత్రంలో కలిసిన రోజు కార్తీకం. ఈ నెల సదాశివుడు, మహావిష్ణువు పూజలకు చాలా పవిత్రమైనది. ఈ మాసంలో ఏకభుక్తం, నిరాహారాది వ్రతాలు చేస్తారు. సాయంత్రాలు దేవాలయాలు, తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. దీపదానాలు చేయలేనివారు గాలికి ఆరిన దీపాలు వెలిగించినా దీపదానం అంత ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఒక్కమాటలో చెప్పాలంటే కార్తీక మాసానికి సమానమైన మాసం, విష్ణుదేవునికంటేసమానమైన దేవుడు, వేదాలకు సమానమైన శాస్త్రాలు, గంగకంటే పుణ్యప్రదమైన […]

ఏపీలో కార్తీక శోభ
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Oct 29, 2019 | 6:02 PM

Share
తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల కార్తీకమాసం. చంద్రుడు కృత్తికా నక్షత్రంలో కలిసిన రోజు కార్తీకం. ఈ నెల సదాశివుడు, మహావిష్ణువు పూజలకు చాలా పవిత్రమైనది. ఈ మాసంలో ఏకభుక్తం, నిరాహారాది వ్రతాలు చేస్తారు. సాయంత్రాలు
దేవాలయాలు, తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. దీపదానాలు చేయలేనివారు గాలికి ఆరిన దీపాలు వెలిగించినా దీపదానం అంత ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఒక్కమాటలో చెప్పాలంటే కార్తీక మాసానికి సమానమైన మాసం, విష్ణుదేవునికంటేసమానమైన దేవుడు, వేదాలకు సమానమైన శాస్త్రాలు, గంగకంటే పుణ్యప్రదమైన తీర్థాలు లేవని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసం అత్యంత ప్రవిత్రమైనది, మహిమానిత్వమైన మాసం. ఈ మాసంలో దేశం నలుమూలల్లో ఉన్నశివాలయాల్లోరుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్రపూజలు విశేషంగా జరుపుతారు. ఆంధ్రప్రదేశ్‌లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.  తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అటు కృష్ణా, గోదావరిలోభక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో కార్తీక మాసం సందడి నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం  సోమేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. గోదావరి నదీ తీరంలోనిశైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాలన్నీ హరహర మహాదేవ శంభోశంకర అంటూ శివనామ స్మరణతో మార్మోగాయి. పురాణ ప్రాశస్థ్యం కలిగిన రాజమహేంద్రవరంలోని కోటిలింగాల ఘాట్‌, పుష్కరఘాట్‌లతో పాటు సరస్వతీ ఘాట్‌, గౌతమిఘాట్‌లు మరింత రద్దీగా కనిపించాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో కార్తీక మాసం కావడంతో తెల్లవారుజాము 2 గంటల నుండే కార్తీక పూజలు ప్రారంభమయ్యాయి. అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు పాదగయ

Follow Us
ఇండియా ఈజ్ ప్యారడైజ్.. డాలర్ వద్దు రూపాయి ముద్దు అంటున్న..
ఇండియా ఈజ్ ప్యారడైజ్.. డాలర్ వద్దు రూపాయి ముద్దు అంటున్న..
శ్రీహరి లేకుంటే మగధీర సినిమా లేదు.!
శ్రీహరి లేకుంటే మగధీర సినిమా లేదు.!
ప్రముఖ ఆధ్యాత్మిక నగరంలో ఉల్లిపాయల నిషేధం వెనుక కారణం ఏమిటి?
ప్రముఖ ఆధ్యాత్మిక నగరంలో ఉల్లిపాయల నిషేధం వెనుక కారణం ఏమిటి?
పాము మీ ఇంట్లో ఉంటే కనిపించే సంకేతాలు ఇవే.. లైట్ తీసుకుంటే..
పాము మీ ఇంట్లో ఉంటే కనిపించే సంకేతాలు ఇవే.. లైట్ తీసుకుంటే..
సాధారణ రైలు, వందే భారత్‌ లోకో పైలెట్ల జీతాల్లో తేడా ఉంటుందా?
సాధారణ రైలు, వందే భారత్‌ లోకో పైలెట్ల జీతాల్లో తేడా ఉంటుందా?
తెల్ల జుట్టును నల్లగా మార్చే మ్యాజిక్ పౌడర్.. నూనెతో కలిపి రాస్త
తెల్ల జుట్టును నల్లగా మార్చే మ్యాజిక్ పౌడర్.. నూనెతో కలిపి రాస్త
సహజంగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ గింజలు వరం
సహజంగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ గింజలు వరం
ఏపీలోని డ్వాక్రా మహిళల అకౌంట్లోకి డబ్బులు.. ఎప్పుడంటే..?
ఏపీలోని డ్వాక్రా మహిళల అకౌంట్లోకి డబ్బులు.. ఎప్పుడంటే..?
కర్ణాటక మహిళకు షాక్ ఇచ్చిన ఆటో డ్రైవర్ మంచితనం.. పోలీసుల ప్రశంసలు
కర్ణాటక మహిళకు షాక్ ఇచ్చిన ఆటో డ్రైవర్ మంచితనం.. పోలీసుల ప్రశంసలు
శోభన్ బాబు చనిపోయే ముందు చివరిగా ఫోన్ చేసి చెప్పిన మాట ఇదే..
శోభన్ బాబు చనిపోయే ముందు చివరిగా ఫోన్ చేసి చెప్పిన మాట ఇదే..