
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి (53) కి కరోనా సోకింది. ఓబులాపురం మైనింగ్ కుంభకోణంలో 2015 నుంచి.. షరతులతో కూడిన బెయిల్ మీదున్నారు జనార్దన్ రెడ్డి. ఆదివారం బళ్లారిలో కర్ణాటక ఆరోగ్య మంత్రి బీ శ్రీరాములు తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు… సుప్రీం కోర్టు నుంచి రెండు రోజుల పాటు అనుమతి తీసుకున్నారు. అయితే, కోవిడ్ సోకడంతో ఆసుపత్రిలో చేరడం వల్ల అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నాని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. లక్షణాలు లేకుండా ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయినట్లు అధికార వర్గాల సమాచారం.
Also Read :