AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నమ్మితే నట్టేట ముంచారు.. జీహెచ్ఎంసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు టోకరా..

జీహెచ్ఎంసీ, ప్రైవేటు సంస్థల్లో తాత్కాలిక ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసిన సంఘటనలో ఒక

నమ్మితే నట్టేట ముంచారు.. జీహెచ్ఎంసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు టోకరా..
uppula Raju
|

Updated on: Dec 18, 2020 | 5:39 AM

Share

జీహెచ్ఎంసీ, ప్రైవేటు సంస్థల్లో తాత్కాలిక ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసిన సంఘటనలో ఒక సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 లోని IXORA కంపెనీకి చెందిన ఆపరేషనల్ మేనేజర్ గంగాధర్, హెచ్ఆర్ మేనేజర్ మహేందర్ ఇద్దరు కలిసి జీహెచ్ఎంసీ ప్రైవేటు సంస్థల్లో తాత్కాలిక ఉద్యోగాల పేరుతో చాలామందిని మోసం చేశారు.

అందరికి కంపెనీకి చెందిన ఐడీ కార్డులు, కరపత్రాలను అందించారు. ఉద్యోగ అవకాశం కల్పించినందుకు ఒక పర్వదినం రూ.ఐదు వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేశారు. ఐదారు నెలలుగా దాదాపు వెయ్యి మందికి పైగా మోసం చేశారు. అనుమానం రావడంతో పలువురు బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేసిన పోలీసులు గంగాధర పాటు మహేందర్‌ను అరెస్ట్ చేశారు. దాదాపు 450 మందికి బ్యాంకు ఖాతాలను ఇచ్చినట్లు గుర్తించారు. రూ.కోటికి పైగా మోసానికి పాల్పడ్డారని అంచనా వేస్తున్నారు. నిందితులను అరెస్టు చేసినట్లు బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కళింగరావు తెలిపారు. వీరి మోసంపై ఛత్రినాక పోలీస్ స్టేషన్‌లో సైతం కేసు నమోదైనట్లు వెల్లడించారు.