AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలి జాబితాను ప్రకటించిన జేడీయూ

ప్రతిపక్ష పార్టీలను సమర్థవంతంగా ఎదుర్కొనే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసిన అధికార జేడీ(యూ) బుధవారం 115 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.

తొలి జాబితాను ప్రకటించిన జేడీయూ
Balaraju Goud
|

Updated on: Oct 07, 2020 | 6:47 PM

Share

బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాల్లో జోరందుకుంది. ప్రతిపక్ష పార్టీలను సమర్థవంతంగా ఎదుర్కొనే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసిన అధికార జేడీ(యూ) బుధవారం 115 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే బీజీపీ తమ తొలి జాబితాను విడుదల చేసి ప్రచారంలో ముందు వరుసలో ఉండగా, తాజాగా జేడీయూ అభ్యర్థలను ప్రకటించింది. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు షాక్ ఇవ్వాలని దూసుకుపోతుంది.

పార్సా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చంద్రికా రాయ్, చెనారి నుంచి లాలన్ పాశ్వాన్, రూపౌలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీమా భారతి బరిలోకి దిగుతున్నారు. తొలుత 25 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను జేడీ(యూ) సోమవారం విడుదల చేసింది. అయితే, దానిని సవరించి బుధవారం కొత్త జాబితాను ఖరారు చేసింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకుగాను ఎన్డీయే కూటమికి చెందిన జేడీ(యూ) 122, బీజేపీ 121 స్థానాల్లో పోటీ చేయాలని సంధి కుదుర్చుకున్నాయి. అయితే అభ్యర్థుల ఖరారులో జేడీ(యూ) ముందు ఉండగా, బీజేపీ ఇప్పటి వరకు 27 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. మరోవైపు ఎన్డీయే కూటమి నుంచి వైదొలగిన ఎల్జేపీ ఈసారి ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తోంది. కాగా, 71 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ 28న జరుగనున్న తొలి విడుత పోలింగ్‌ కోసం నామినేషన్‌ దాఖలుకు గురువారం చివరి రోజు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఖరారులో అన్ని పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి.

Follow Us
IPLలో సెన్సేషన్.. హీరోయిన్ జూహీ చావ్లా కూతురిని చూశారా.. ?
IPLలో సెన్సేషన్.. హీరోయిన్ జూహీ చావ్లా కూతురిని చూశారా.. ?
క్షమించు ఆయేషా.. కాసిన్ని కన్నీళ్లు తప్ప నీకు ఏం ఇవ్వలేకపోయాం..
క్షమించు ఆయేషా.. కాసిన్ని కన్నీళ్లు తప్ప నీకు ఏం ఇవ్వలేకపోయాం..
కొంప ముంచిన వరుడి అతి విశ్వాసం..!
కొంప ముంచిన వరుడి అతి విశ్వాసం..!
సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ పోరు ఫిక్స్.. ట్విస్ట్ అదిరిపోలా..?
సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ పోరు ఫిక్స్.. ట్విస్ట్ అదిరిపోలా..?
ఆహా ఏమి రుచి.. చుక్క నూనె లేకుండా టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై..
ఆహా ఏమి రుచి.. చుక్క నూనె లేకుండా టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై..
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. ఫొటోలు వైరల్
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. ఫొటోలు వైరల్
కోల్‌కతాలో భారీ భూకంపం.. ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టిన జనాలు
కోల్‌కతాలో భారీ భూకంపం.. ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టిన జనాలు
మీ తల రాతను మార్చే ఫొటోలు ఇవే.. ఇంట్లో ఉంటే లక్కే లక్కు!
మీ తల రాతను మార్చే ఫొటోలు ఇవే.. ఇంట్లో ఉంటే లక్కే లక్కు!
చెవి సమస్యలకు పతంజలి ఆయుర్వేధంతో అద్భుతచికిత్స..నో సైడ్ ఎఫెక్ట్స్
చెవి సమస్యలకు పతంజలి ఆయుర్వేధంతో అద్భుతచికిత్స..నో సైడ్ ఎఫెక్ట్స్
సర్దిచెప్పేందుకు వెళ్లి చావు కొని తెచ్చుకున్న యువకుడు..!
సర్దిచెప్పేందుకు వెళ్లి చావు కొని తెచ్చుకున్న యువకుడు..!