AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ – ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రుల భేటి.. పలు ద్వైపాక్షిక సంబంధాలపై ఒప్పందం

India - Uzbekistan: భారత్-ఉజ్బెకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు మధ్య గురువారం ఒప్పందం జరిగింది. దీనిలో భాగంగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు బహుపాక్షిక సంబంధాలపై..

భారత్ - ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రుల భేటి.. పలు ద్వైపాక్షిక సంబంధాలపై ఒప్పందం
Shaik Madar Saheb
|

Updated on: Feb 25, 2021 | 4:08 PM

Share

India – Uzbekistan: భారత్-ఉజ్బెకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు మధ్య గురువారం ఒప్పందం జరిగింది. దీనిలో భాగంగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు బహుపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ మేరకు గురువారం ఉదయం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఉజ్బెకిస్తాన్‌ విదేశాంగ మంత్రి అబ్దుల్ అజీజ్ కమిలోవ్‌.. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చజరిగింది. అభివృద్ధి, రక్షణ రంగం, కనెక్టివిటీ, వాణిజ్యం, సంస్కృతి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు జైశంకర్ తెలిపారు. దీంతోపాటు ఆఫ్ఘానిస్తాన్ పరిస్థితిపై కూడా ఇరు దేశాలు అభిప్రాయాలు పంచుకున్నాయని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఉజ్బెకిస్తాన్‌ విదేశాంగ మంత్రి అబ్దుల్ అజీజ్ కమిలోవ్‌ను స్వాగతిస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ జైశంకర్ పేర్కొన్నారు. ఇరు దేశాలు కూడా బహుపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు అంగీకరించాయని జైశంకర్ తెలిపారు. కాగా.. కమిలోవ్ రెండు రోజుల పర్యటన కోసం ఆయన బుధవారం భారత్‌కు చేరుకున్నారు. గురువారం సాయంత్రం కమిలోవ్ తాష్కెంట్‌కు బయలుదేరనున్నారు.

కాగా అంతకుముందు గతేడాది డిసెంబర్ 11న ప్రధాని నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు శావ్‌కట్ మిర్జియోయెవ్ వర్చువల్ విధానంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య పునరుత్పాదిత ఇంధనం, డిజిటల్, సైబర్ టెక్నాలజీ, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు, వస్తు రవాణా, సమాచార మార్పిడి వంటి రంగాల్లో మొత్తం 9 ఒప్పందాలు కుదిరాయి. అలాగే, ఉజ్బెకిస్తాన్‌లో అభివృద్ధి కార్యక్రమాల కోసం భారత్ 44.8 కోట్ల డాలర్ల రుణాన్ని అందించేందుకు అంగీకరించింది.

Also Read:

ఆస్ట్రేలియాలో ఇక వెల్లువెత్తనున్న ఫేస్ బుక్, గూగుల్ పెట్టుబడులు, కొత్త చట్టానికి పార్లమెంట్ అనుమతి

ట్రంప్ మరో ఆర్డర్ బుట్టదాఖలు, గ్రీన్ కార్డు కోరుతున్నవారిపై బ్యాన్ ఎత్తివేసిన అధ్యక్షుడు జోబైడెన్

Follow Us
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..