AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అధికారులకు జగన్ వారం రోజుల వార్నింగ్

ఏపీ అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారం రోజుల వార్నింగ్ ఇచ్చారు. అమరావతి క్యాంప్ ఆఫీసులో గురువారం కీలకమైన సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. ఈ సమీక్షా సమావేశంలోనే ఆయన అధికారులకు వారం రోజుల వార్నింగ్ ఇచ్చారు. ఉగాది పండుగ రోజున 25 లక్షల ఇళ్ళ పట్టాలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ దిశగా అడుగులు వేగవంతం చేశారు. ఈ అంశంపై గురువారం తన క్యాంప్ ఆఫీసులో అధికారులతో సమీక్ష జరిపారు సీఎం. ఈ […]

అధికారులకు జగన్ వారం రోజుల వార్నింగ్
Rajesh Sharma
| Edited By: |

Updated on: Dec 26, 2019 | 6:01 PM

Share

ఏపీ అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారం రోజుల వార్నింగ్ ఇచ్చారు. అమరావతి క్యాంప్ ఆఫీసులో గురువారం కీలకమైన సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. ఈ సమీక్షా సమావేశంలోనే ఆయన అధికారులకు వారం రోజుల వార్నింగ్ ఇచ్చారు.

ఉగాది పండుగ రోజున 25 లక్షల ఇళ్ళ పట్టాలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ దిశగా అడుగులు వేగవంతం చేశారు. ఈ అంశంపై గురువారం తన క్యాంప్ ఆఫీసులో అధికారులతో సమీక్ష జరిపారు సీఎం. ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, సీఎస్‌ నీలం సహానీ ఇతర అధికారులు హాజరయ్యారు.

ఈ భేటీలో కీలకమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. జిల్లాల వారీగా లబ్ధిదారుల సంఖ్య, గుర్తించిన స్థలాలపై సమీక్ష జరిపారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇళ్ల పట్టాలకోసం అధికంగా భూములు సేకరించాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు. భూముల గుర్తింపు వారం రోజుల్లో పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు.

లబ్ధిదారులకు ఇళ్లస్థలాలు మార్కింగ్‌ చేసి ఇంటిపట్టాలను రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని సీఎం నిర్దేశించారు. పట్టాపత్రాన్ని సెక్యూరిటీ ఫీచర్స్‌తో రూపొందించాలని చెప్పారాయన. దీనికి సంబంధించి పలు రకాల నమూనా పత్రాలను అధికారులు సీఎంకు చూపించారు. అర్హత ఉండి ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వాలని ఆయన ఆదేశించారు.

ఇప్పటివరక 22 లక్షల 46 వేల139 మంది లబ్ధిదారులను గుర్తించామని, వీరిలో 11 లక్షల 77 వేల 260 మంది గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులని, 10 లక్షల 99 వేల 160 మంది పట్ణణ ప్రాంతాల్లో లబ్ధిదారులని అధికారులు గణాంకాలను సీఎంకు తెలిపారు. వీరందరికీ ఇళ్ళ పట్టాలిచ్చేందుకు సుమారు 23 వేల ఎకరాల భూములు అవసరమని చెబుతున్నారు.