IPL 2020: MI vs DC: ధావన్ సూపర్ ఇన్నింగ్స్‌.. ముంబై టార్గెట్ 163

అబుదాబి వేదికగా  జరుగుతున్న ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మంచి స్కోర్ చేసింది.

IPL 2020: MI vs DC: ధావన్ సూపర్ ఇన్నింగ్స్‌.. ముంబై టార్గెట్ 163
Follow us

|

Updated on: Oct 11, 2020 | 11:29 PM

అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మంచి స్కోర్ చేసింది.  శిఖర్‌ ధావన్‌ (69*; 52 బంతుల్లో 6×4, 1×6), శ్రేయస్ అయ్యర్ (42; 33 బంతుల్లో, 4×4, 1×6) రాణించడంతో ముంబైకి ఢిల్లీ 163 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల కోల్పోయి 162 పరుగులు చేసింది. అయితే జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. మొదటి ఓవర్‌లోనే పృథ్వీ షా (4; 3 బంతుల్లో, 1×4)ను బౌల్ట్‌ ఔట్ చేశాడు. ఈ సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్‌ ఆడుతున్న రహానె (15) కూడా ఎక్కువ పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్‌తో కలిసి ధావన్‌ ఇన్నింగ్స్‌ను గాడినపెట్టాడు. మంచి షాట్లు ఆడిన వీరిద్దరు..మూడో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. అయితే స్పీడు పెంచే క్రమంలో  కృనాల్ బౌలింగ్‌లో శ్రేయస్ ఔటయ్యాడు. ( Bigg Boss Telugu 4 : హౌస్ నుంచి సుజాత్ ఔట్ !..రీజన్స్ ఇవే ! )

అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన స్టాయినిస్‌ (13; 8 బంతుల్లో 2×4)తో కలిసి ధావన్‌ ఇన్నింగ్స్‌ కొనసాగించాడు. ఈ క్రమంలో ధావన్ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే రెండో పరుగు కోసం ప్రయత్నించిన స్టాయినిస్‌ (13; 8 బంతుల్లో 2×4) రనౌటయ్యాడు. ఆఖర్లో అలెక్స్‌ కేరీ (14; 9 బంతుల్లో), ధావన్‌ స్పీడు పెంచలేకపోయారు. ముంబై బౌలర్లలో కృనాల్ రెండు వికెట్లు తీయగా, బౌల్ట్‌కు‌ ఒక్క వికెట్ దక్కింది.