ఐపీఎల్ 2020: కోహ్లీ, పడిక్కల్ మెరుపులు.. బెంగళూరుకు మూడో విజయం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆదరగొట్టింది. అబుదాబీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌‌పై అద్భుత విజయాన్ని సాధించింది.

ఐపీఎల్ 2020: కోహ్లీ, పడిక్కల్ మెరుపులు.. బెంగళూరుకు మూడో విజయం
Follow us

|

Updated on: Oct 03, 2020 | 8:07 PM

IPL 2020: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆదరగొట్టింది. అబుదాబీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌‌పై అద్భుత విజయాన్ని సాధించింది. లీగ్‌లో బెంగళూరుకు ఇది మూడో విజయం కాగా.. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సూపర్బ్ అర్ధ శతకంతో అదరగొట్టాడు. యంగ్ ప్లేయర్ లోమరోర్(47) రాణించడంతో మొదట రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఛేదనలో బెంగళూరు దుమ్ముదులిపింది. ఓపెనర్ పడిక్కల్(63), కెప్టెన్ విరాట్ కోహ్లీ(72) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో టార్గెట్‌ను అలవోకగా చేధించింది. 5 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. రాయల్స్ బౌలర్లలో ఆర్చర్, గోపాల్ చెరో వికెట్ తీశారు.