AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

#COVID19 కరీంనగర్‌లో కరోనా రోగులు.. ఎక్కడెక్కడ తిరిగారంటే..

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఇండోనేషియన్ కరోనా పాజిటివ్ మనుషుల కదలికల వ్యవహారంలో కీలకమైన సీసీ ఫుటేజ్ లభ్యమైంది. ఇండోనేషియా నుంచి ఢిల్లీ మీదుగా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన.. ఇండోనేషియన్ వ్యక్తులు...

#COVID19 కరీంనగర్‌లో కరోనా రోగులు.. ఎక్కడెక్కడ తిరిగారంటే..
Rajesh Sharma
|

Updated on: Mar 19, 2020 | 4:16 PM

Share

Corona positive persons movement in Karimnagar: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఇండోనేషియన్ కరోనా పాజిటివ్ మనుషుల కదలికల వ్యవహారంలో కీలకమైన సీసీ ఫుటేజ్ లభ్యమైంది. ఇండోనేషియా నుంచి ఢిల్లీ మీదుగా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన.. ఇండోనేషియన్ వ్యక్తులు… కరీంనగర్‌లో 48 గంటల పాటు సంచరించారు. అనుమానం కలుగ కుండా వీరు తిరుగుతున్న దృశ్యాలను కరీంనగర్ పోలీసులు సేకరించారు.

వీరంతా మత సంబంధమైన పనులపై కరీంనగర్‌కు వచ్చినట్లు భావిస్తున్నారు. ఎటు వెళ్ళినా మొత్తం ఏడుగురు వ్యక్తులు కలిసే వెళ్ళడం వీరి ప్రవర్తనపై అనుమానాలకు తావిస్తోంది. చివరికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో కరీంనగర్‌లోనే ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. శాంపిల్స్‌ని హైదరాబాద్‌కు పంపించారు. అక్కడి ల్యాబ్స్ కరోనా పాజిటివ్‌గా తేల్చడంతో తెలంగాణలో ఒకే రోజున ఎనిమిది కేసులు రికార్డయ్యాయి. ఈ ఎనిమిదింటిలో ఏడు ఇండోనేషియా నుంచి వచ్చిన ఈ బృందం సభ్యులవే కావడం ప్రమాదకర పరిస్థితిని సూచిస్తోంది.

మార్చి 14న తబ్లిక్ జమాత్ కోసం వచ్చి బొమ్మకల్, గుంటూరు పల్లి మసీదులో 16వ తేదీ వరకు బస చేసి, వెళ్లినట్టు సమాచారం. వారు మసీదులో బస చేసిన సమయంలో వారితో చాలా మంది గ్రామస్తులు కలిసినట్లు తెలుస్తోంది. దీనిపై లోతుగా విచారణ చేపట్టిన ఆ గ్రామాలలో వాకబు చేస్తున్నట్లు సమాచారం. వీరితో కలిసిన, మాట్లాడిన వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు చెబుతున్నారు.

ఇలా తమకు వైరస్ సోకిందని తెలిసో.. తెలియకనో విచ్చలవిడిగా తిరుగుతూ జనమందరికీ వైరస్‌ను అంటిస్తున్న వారెంత మంది వున్నారో అన్న భయాందోళన కలుగుతోంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అత్యవసరమైతే తప్ప ఇళ్ళ నుంచి బయటికి రావద్దని చెబుతున్నారు. ఎవరైనా విదేశాలకు వెళ్ళి వచ్చిన సమాచారం తెలిస్తే.. వెంటనే దగ్గరలోని పోలీసులకుగానీ.. వైద్య వర్గాలకు గానీ సమాచారం అందించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.

Follow Us
అరటిపండు Vs ఖర్జూరం.. రెండిటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
అరటిపండు Vs ఖర్జూరం.. రెండిటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
పీఎం కిసాన్ విడుదల వేళ కేంద్రం అలర్ట్.. రైతుల ఫోన్లకు మెస్సేజ్
పీఎం కిసాన్ విడుదల వేళ కేంద్రం అలర్ట్.. రైతుల ఫోన్లకు మెస్సేజ్
JEE Main 2026 దరఖాస్తుకు మళ్లీ తెరచుకున్న అప్లికేషన్లు..లింక్ ఇదే
JEE Main 2026 దరఖాస్తుకు మళ్లీ తెరచుకున్న అప్లికేషన్లు..లింక్ ఇదే
కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. మహిళలకు పండగే..
కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. మహిళలకు పండగే..
అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్.. యుద్ధం ఆపాలంటే..
అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్.. యుద్ధం ఆపాలంటే..
Horoscope Today: వావ్.. వారికి ఆదాయం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వావ్.. వారికి ఆదాయం పెరిగే ఛాన్స్..
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..