AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐసీఎంఆర్ రూల్స్ ప్రకారమే ప్రైవేట్ హాస్పిటల్స్ ఫీజులు..!

ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ లో కొవిడ్-19 బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రయివేట్ ఆస్పత్రులు కరోనా బాధతులను నుంచి పెద్ద మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేయాల్సిన ఫీజుల వివరాలతో కూడిన ప్రతిపాదనను తమిళనాడు ప్రభుత్వానికి ఐసీఎంఆర్ అందజేసింది.

ఐసీఎంఆర్ రూల్స్ ప్రకారమే ప్రైవేట్ హాస్పిటల్స్ ఫీజులు..!
Balaraju Goud
|

Updated on: Jun 05, 2020 | 4:08 PM

Share

కరోనా మహమ్మారి దేశాన్ని కుదిపేస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో రోజు రోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ లో కొవిడ్-19 బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రయివేట్ ఆస్పత్రులు కరోనా బాధతులను నుంచి పెద్ద మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో భారతీయ వైద్య మండలి స్పందించింది. ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేయాల్సిన ఫీజుల వివరాలతో కూడిన ప్రతిపాదనను తమిళనాడు ప్రభుత్వానికి అందజేసింది. తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య విజృంభిస్తుండడంతో ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేటు ఆస్పతుల్లోనూ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యం భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో భారత వైద్య పరిశోధనామండలి ఐసీఎంఆర్ సీరియస్ గా తీసుకుంది. రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగులకు చికిత్సలందించడానికి వసూలు చేయాల్సిన ఫీజుల వివరాలను ప్రకటించింది. పాజిటివ్‌ లక్షణాలు ఉండి, ఆరోగ్య పరిస్థితి క్షిణించి ఉంటే 10 రోజుల చికిత్సకు రూ.2,31,820లను ఫీజుగా వసూలు చేయాలని తెలిపింది. కరోనా వైరస్‌ సోకిన సాధారణ రోగులకు మాత్రం రోజుకు రూ.23,182 వంతున ఫీజులు వసూలు చేయాలని సూచించింది. అాలాగే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న పేషెంట్స్ నుంచి రోజుకు రూ.25,377 చొప్పున 17 రోజులకు రూ.4,31,411లను వసూలు చేయాలని వివరించింది. కరోనా బాధితులకు చికిత్సలతోపాటు పౌషికాహారం, అన్ని సదుపాయాలకు గానూ రోజుకు రూ.9,600 లకు మించకుండా వసూలు చేయాలని భారతీయ వైద్యమండలి తెలిపింది. ఐసీఎంఆర్ ప్రతిపాదనలపై తమిళ సర్కార్ చర్చించి ఫీజుల వివరాలను ఖరారు చేయనుంది.