మాచ్ ఓడినా…ధోని మనసులు గెలిచాడు

| Edited By: Ravi Kiran

Sep 01, 2020 | 7:10 PM

రాంచీ: హామిల్టన్‌ లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ టీ20 లో భారత్ ఓడిపోయినా.. మాజీ కెప్టెన్, వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోని మీద మాత్రం ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనికి కారణం మహీ జాతీయ జెండాకు ఇచ్చిన గౌరవం. మ్యాచ్ జరుగుతుండగా ధోని అభిమాని సెక్యురిటిని దాటుకుని మైదానంలోకి వెళ్లాడు. గ్రౌండ్ మధ్యలోకి వెళ్లి ధోనికి కాళ్లకి నమస్కరించాడు. ఐతే అతను కిందికి వంగే క్రమంలో చేతిలో ఉన్న భారత జాతీయ జెండా కింద పడబోతుంటే.. […]

మాచ్ ఓడినా...ధోని మనసులు గెలిచాడు
Follow us on

రాంచీ: హామిల్టన్‌ లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ టీ20 లో భారత్ ఓడిపోయినా.. మాజీ కెప్టెన్, వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోని మీద మాత్రం ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనికి కారణం మహీ జాతీయ జెండాకు ఇచ్చిన గౌరవం. మ్యాచ్ జరుగుతుండగా ధోని అభిమాని సెక్యురిటిని దాటుకుని మైదానంలోకి వెళ్లాడు. గ్రౌండ్ మధ్యలోకి వెళ్లి ధోనికి కాళ్లకి నమస్కరించాడు. ఐతే అతను కిందికి వంగే క్రమంలో చేతిలో ఉన్న భారత జాతీయ జెండా కింద పడబోతుంటే.. ధోని స్పందించి దాన్నితన చేతికి తీసుకోవడంతో అతడిపై ప్రశంసల జల్లు కురిస్తోంది. పలవురు సెలబ్రిటీలు సైతం ధోని చేసిన పనికి ఫిదా అవుతున్నారు. దీంతో ధోని అభిమానులు మా తలైవా సూపర్ అంటూ తెగ మురిసిపోతున్నారు.