India Vs Australia 2020: మరో రెండు రోజుల్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్ల మధ్య వార్మప్ మ్యాచ్లు పూర్తి కాగా.. ప్రస్తుతం రెండు టీమ్లు జట్టు కూర్పుపై తర్జన భర్జన పడుతున్నాయి. ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్, ఆల్ రౌండర్లు.. ఇలా వివిధ స్లాట్స్ను ఏయే ఆటగాళ్లు భర్తీ చేయనున్నారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ఆసీస్తో జరిగిన టీ20లలో అదరగొట్టిన యార్కర్ కింగ్ నటరాజన్ను టెస్టుల్లో బరిలోకి దింపాలని భారత్ జట్టు యాజమాన్యం భావిస్తోందట. జస్ప్రిత్ బుమ్రాతో పాటు నటరాజన్ కూడా తుది జట్టులో ఉంటే బౌలింగ్ విభాగం బలంగా ఉంటుందని అనుకుంటున్నారు. కాగా, నటరాజన్తో పాటు శార్దూల్ ఠాకూర్, ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్లను కూడా బ్యాకప్ నెట్ బౌలర్లుగా టీమ్ మేనేజ్మెంట్ అందుబాటులో ఉంచినట్లు సమాచారం.
Also Read: