AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూతలం నుంచి గగనతల లక్ష్యాన్ని ఛేదించిన మిసైల్, భారత అమ్ములపొదిలో మరో ‘అధునాస్త్రం’!

భూతలం నుంచి గగనతల లక్ష్యాన్ని ఛేదించే మిసైల్ ప్రయోగాన్ని ఇండియా విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా బాలాసోర్ లోని ప్రయోగకేంద్రం నుంచి 'క్విక్ రియాక్షన్ సర్ ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టం'

భూతలం నుంచి గగనతల లక్ష్యాన్ని ఛేదించిన మిసైల్, భారత అమ్ములపొదిలో మరో 'అధునాస్త్రం'!
Umakanth Rao
| Edited By: |

Updated on: Nov 14, 2020 | 1:10 PM

Share

భూతలం నుంచి గగనతల లక్ష్యాన్ని ఛేదించే మిసైల్ ప్రయోగాన్ని ఇండియా విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా బాలాసోర్ లోని ప్రయోగకేంద్రం నుంచి ‘క్విక్ రియాక్షన్ సర్ ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టం’ టెస్ట్ ఫైర్ సక్సెస్ అయిందని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఆరు కెనిష్ఠ రైజ్డ్ మిసైల్స్ ని మోసుకుపోగల మొబైల్ లాంచర్ ని వినియోగించి  ఈ క్షిపణిని ప్రయోగించారు. సింగిల్ స్టేజ్ ప్రొపెల్లెంట్ రాకెట్ మోటార్ తో కూడిన ఈ క్షిపణి తయారీ కోసం అన్నీ దేశీయ ఉత్పత్తులనే వినియోగించారు.  ఈ ఫ్లైట్ టెస్ట్ లో మల్టీ ఫంక్షన్ రాడార్, బ్యాటరీ సర్వేలెన్న్ రాడార్, బ్యాటరీ కమాండ్ పోస్ట్ వెహికల్, మొబైల్ లాంచర్ వంటి అత్యంత ఆధునిక సిస్టమ్స్ ను వాడినట్టు రక్షణ శాఖ వెల్లడించింది. ఈ మిసైల్ భారత ఆర్మీకి ఎయిర్ డిఫెన్స్ విషయంలో ఎంతో తోడ్పడుతుందని ఈ శాఖ వివరించింది.

రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, డీ ఆర్ డీఓ డైరెక్టర్ సతీష్ రెడ్డి తదితరులు ఈ క్షిపణి ప్రయోగం సక్సెస్ కావడంపట్ల హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు.

Follow Us