AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్తాన్ వెళ్లనున్న భారత అథ్లెట్లు.. 14 ఏళ్ల తర్వాత మహా సంగ్రామం..!

2027 South Asian Games కోసం భారత అథ్లెట్లు పాకిస్థాన్‌కు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. రెండు దేశాల మధ్య జరిగిన చర్చల్లో భారత క్రీడాకారులు పాకిస్థాన్‌లో జరిగే పోటీల్లో పాల్గొనే అంశంపై ఒప్పందం కుదిరినట్లు నివేదిక తెలిపింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో జరగనున్న ఈ క్రీడలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

పాకిస్తాన్ వెళ్లనున్న భారత అథ్లెట్లు.. 14 ఏళ్ల తర్వాత మహా సంగ్రామం..!
South Asian Games 2027
Venkata Chari
|

Updated on: Sep 07, 2026 | 8:00 PM

Share

సౌత్ ఏసియా గేమ్స్ (2027 South Asian Games) (SAF Games) కోసం భారత అథ్లెట్లు పాకిస్థాన్‌కు వెళ్లే అంశంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత క్రీడాకారులు పాకిస్థాన్‌లో జరిగే ఈ క్రీడల్లో పాల్గొనేందుకు ఇరు పక్షాల మధ్య అవగాహన కుదిరినట్లు సమాచారం. దీంతో వచ్చే ఏడాది జరిగే క్రీడల కోసం ఏర్పాట్లు మరింత ఆసక్తికరంగా మారాయి.

14 ఏళ్ల తర్వాత పాక్‌లో..

సౌత్ ఏసియా గేమ్స్ చివరిసారిగా 2019లో నేపాల్‌లో జరిగాయి. అనంతరం వివిధ కారణాలతో తదుపరి ఎడిషన్‌ ఆలస్యమైంది. 2027 SAF Gamesకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో ఈ స్థాయి ప్రాంతీయ క్రీడా పోటీలు జరగనున్నాయి.

భారత్ పాల్గొనడంపై స్పష్టత

భారత్–పాకిస్థాన్ మధ్య రాజకీయ సంబంధాల ప్రభావం క్రీడలపైనా కనిపిస్తున్న నేపథ్యంలో.. భారత అథ్లెట్లు పాకిస్థాన్‌కు వెళ్లి పోటీల్లో పాల్గొంటారా అనే అంశం కీలకంగా మారింది. తాజా చర్చల్లో భారత బృందం పాల్గొనే విషయంపై ఒప్పందం కుదిరినట్లు నివేదిక పేర్కొంది.

ప్రాంతీయ క్రీడలకు ఊపు

సౌత్ ఏసియా గేమ్స్‌లో భారత్, పాకిస్థాన్‌తో పాటు దక్షిణాసియాకు చెందిన ఇతర దేశాల క్రీడాకారులు పాల్గొంటారు. 2027 ఎడిషన్‌లో భారత అథ్లెట్లు పాల్గొంటే.. ఈ పోటీకి మరింత ప్రాధాన్యం ఏర్పడనుంది. ముఖ్యంగా పాకిస్థాన్ వేదికగా జరిగే ఈ క్రీడల్లో భారత్ పాల్గొనడం క్రీడా వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

2027 శాప్ గేమ్స్ నిర్వహణకు సంబంధించిన తదుపరి ప్రక్రియలో భారత్ పాల్గొనే అంశం ఇప్పుడు ప్రధానంగా నిలిచింది. భారత అథ్లెట్ల పాకిస్థాన్ పర్యటనకు సంబంధించిన ఈ అవగాహన అమల్లోకి వస్తే.. రెండు దేశాల క్రీడా సంబంధాల్లో ఇది గమనించదగ్గ పరిణామంగా నిలవనుంది.

Follow Us