బ్రిటన్​ ప్రధాని బోరిస్​కి మోదీ ఫోన్..ఏం మాట్లాడారంటే?

|

Aug 21, 2019 | 5:07 AM

బ్రిటన్​ ప్రధానిగా ఇటీవల ఎన్నికైన బోరిస్​ జాన్సన్​కు భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. తాజా పరిణామాలపై చర్చించేందుకు బోరిస్​తో ఫోన్లో సంభాషించారు మోదీ. రెండో సారి భారత్​కు ప్రధానిగా ఎన్నికైన మోదీకి కూడా బోరిస్​ శుభాకాంక్షలు చెప్పారు. చర్చలో భాగంగా చాలా అంశాలపై ఇద్దరు నేతలు మాట్లాడినట్లు భారత ప్రధాని కార్యాలయం తెలిపింది. ఆగస్టు 15న లండన్​లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్న భారతీయులపై దాడిని బోరిస్​తో ప్రస్తావించారు మోదీ. ఈ ఘటనపై బ్రిటన్ ప్రధాని​ […]

బ్రిటన్​ ప్రధాని బోరిస్​కి మోదీ ఫోన్..ఏం మాట్లాడారంటే?
PM Modi held telephonic conversation with his British counterpart Boris Johnson
Follow us on

బ్రిటన్​ ప్రధానిగా ఇటీవల ఎన్నికైన బోరిస్​ జాన్సన్​కు భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. తాజా పరిణామాలపై చర్చించేందుకు బోరిస్​తో ఫోన్లో సంభాషించారు మోదీ. రెండో సారి భారత్​కు ప్రధానిగా ఎన్నికైన మోదీకి కూడా బోరిస్​ శుభాకాంక్షలు చెప్పారు.

చర్చలో భాగంగా చాలా అంశాలపై ఇద్దరు నేతలు మాట్లాడినట్లు భారత ప్రధాని కార్యాలయం తెలిపింది. ఆగస్టు 15న లండన్​లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్న భారతీయులపై దాడిని బోరిస్​తో ప్రస్తావించారు మోదీ. ఈ ఘటనపై బ్రిటన్ ప్రధాని​ విచారం వ్యక్తం చేశారు. భారత హైకమిషన్, అందులోని అధికారులు, పర్యటాకులకు పూర్తి భద్రత కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చారు.