తెరుచుకోనున్న శిల్పారామం

హైటెక్‌ సిటీ సమీపంలోని పల్లె అందాలతో కనువిందు చేసే శిల్పారామం అక్టోబర్‌ 2 నుంచి తెరుచుకోనుంది. శిల్పారామం తిరిగి సందర్శకులకు అందుబాటులోకి రానుంది. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల...

తెరుచుకోనున్న శిల్పారామం
Follow us

|

Updated on: Sep 27, 2020 | 4:59 AM

Shilparamam : కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ సమయంలో మూతపడిన టూరిజనం సెంటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. హైటెక్‌ సిటీ సమీపంలోని పల్లె అందాలతో కనువిందు చేసే శిల్పారామం అక్టోబర్‌ 2 నుంచి తెరుచుకోనుంది. శిల్పారామం తిరిగి సందర్శకులకు అందుబాటులోకి రానుంది. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు శిల్పారామం తెరిచి ఉండ‌నుంది.

పర్యాటకుల థర్మో చెక్ చేసిన తరువాతే లోపలికి అధికారులు అనుమతించనున్నారు. కేంద్రప్రభుత్వం జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు అర్బ‌న్ పార్కుల‌ను తెరిచేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చిన విష‌యం తెలిసిందే. క‌రోనా నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి సంద‌ర్శ‌కుల‌కు శానిటైజ‌ర్ల‌ను అందుబాటులో ఉంచాల‌ని, మాస్కులు ధ‌రించిన వారినే లోప‌ల‌కు అనుమ‌తించాల‌ని అధికారుల‌ను ప్ర‌భుత్వం ఆదేశించింది.