AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fruit Vendor Murder case: పళ్ల వ్యాపారి ప్రాణం తీసిన రూ.10.. హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ముగ్గురి అరెస్ట్

రూ.10 కోసం పళ్ల వ్యాపారి హత్య కేసును ఛేదించిన హైదరాబాద్ పోలీసులు.

Fruit Vendor Murder case: పళ్ల వ్యాపారి ప్రాణం తీసిన రూ.10.. హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ముగ్గురి అరెస్ట్
Balaraju Goud
|

Updated on: Jan 07, 2021 | 4:30 PM

Share

పది రూపాయల కోసం ఓ పండ్ల వ్యాపారిని హత్య చేసిన కేసులో నిందితులను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మొహమ్మద్ షాకీబ్ అలీ.. కూకట్‌పల్లి కృష్ణవేణి నగర్ లో నివాసం ఉంటూ తులసినగర్ లో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఈనెల 1వ తేదీన‌ పండ్లను విక్రయిస్తున్న షాకీబ్ అలీ దగ్గరికి ఎల్లమ్మబండకు చెందిన యండి నసీమ్, సమీర్ ఖాద్రీ, మరో బాలుడితో కలిసి పైనాపిల్, ద్రాక్షాపళ్లను కొనుగోలు చేశారు. కొనుగోలు సమయంలో పది రూపాయలు పండ్లకు ఇవ్వాలని షాకీబ్ అలీ కోరాడు. ఇదే విషయంలో షాకీబ్ అలీకి నసీమ్‌కు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

దీంతో నసీమ్ తన స్నేహితులకు ఫోన్‌చేసి స్నేహితులను పిలిపించి. అందరు కలిసి షకీబ్ అలీపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన షకీబ్ చికిత్స పొందుతూ ఈనెల 3వ తేదీన మృతి చెందాడు. హత్యకు పాల్పడిన ముగ్గరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఏసీపీ సురేందర్ రావు తెలిపారు.

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..