ఫిర్యాదుదారుల‌పై దురుసు ప్ర‌వ‌ర్త‌న, ఇద్ద‌రు పోలీసులు స‌స్పెండ్

|

Aug 28, 2020 | 7:08 PM

తెలంగాణ‌ పోలీస్ శాఖ.. త‌మ‌ సిబ్బంది విధుల్లో అల‌సత్వం ప్ర‌ద‌ర్శించినా, క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పినా.. అస్స‌లు ఉపేక్షించ‌డం లేదు. వెంట‌నే శాఖ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటుంది.

ఫిర్యాదుదారుల‌పై దురుసు ప్ర‌వ‌ర్త‌న, ఇద్ద‌రు పోలీసులు స‌స్పెండ్
Follow us on

తెలంగాణ‌ పోలీస్ శాఖ.. త‌మ‌ సిబ్బంది విధుల్లో అల‌సత్వం ప్ర‌ద‌ర్శించినా, క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పినా.. అస్స‌లు ఉపేక్షించ‌డం లేదు. వెంట‌నే శాఖ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఫిర్యాదు అందిన వెంట‌నే అంత‌ర్గ‌త విచార‌ణ‌కు ఆదేశిస్తూ, త‌ప్పు చేసిన‌ట్టు తెలిస్తే మాత్రం వేటు వేస్తుంది. ఇటీవ‌ల కాలంలో జంట న‌గ‌రాలు ప‌రిధిలో ప‌లువురు పోలీసు అధికారుల‌ను, సిబ్బందిని సస్పెండ్ చేశారు ఉన్న‌తాధికారులు.

తాజాగా హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బిక్షం, హోం గార్డ్ మోహన్ రెడ్డిల‌పై వేటు ప‌డింది. ఈ ఇద్ద‌ర్నీ సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఫిర్యాదుదారులపై దురుసుగా ప్రవర్తించడంతో ఇద్దరినీ సస్పెండ్ చేశారు సీపీ.

 

Also Read :

సోంపేటలో 19 మంది వాలంటీర్లపై వేటు

ఈ గొర్రె రేటెంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే !