పశ్చిమ బెంగాల్ లో రెండో రోజు అమిత్ షా పర్యటన, సింగర్ ఇంట్లో లంచ్, బోల్ పూర్ లో రోడ్ షో..కూల్ కూల్ గా !

హోం మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో రెండో రోజైన ఆదివారం జరిపిన పర్యటనలో కూల్ కూల్ గా కనిపించారు. నిన్నటి రోజంతా ప్రత్యర్థి పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ను, ఈ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని..

పశ్చిమ బెంగాల్ లో రెండో రోజు అమిత్ షా పర్యటన, సింగర్ ఇంట్లో లంచ్, బోల్ పూర్ లో రోడ్ షో..కూల్ కూల్ గా !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 20, 2020 | 3:56 PM

హోం మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో రెండో రోజైన ఆదివారం జరిపిన పర్యటనలో కూల్ కూల్ గా కనిపించారు. నిన్నటి రోజంతా ప్రత్యర్థి పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ను, ఈ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని తన ఉద్వేగ ప్రసంగంలో దుయ్యబట్టిన ఆయన.. నేడు విశ్వభారతి యూనివర్సిటీ లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యార్థినులు చేసిన నృత్యాలను తిలకించారు. శాంతినికేతన్ లో రవీంద్ర భవన్ వద్ద రవీంద్ర నాథ్ ఠాగూర్ కి శ్రధ్ధాంజలి ఘటించారు. బీర్ భూమ్ జిల్లాలో ఓ జానపద గాయకుడి ఇంట్లో లంచ్ చేసి.. బోల్ పూర్ లో జరిగిన రోడ్ షో లో పాల్గొన్న ఆయన, ఏ ప్రసంగమూ చేయకుండానే కదిలారు.

విశ్వభారతి వీసీతోను, ఫాకల్టీ సభ్యులతోను అమిత్ షా సమావేశమవుతారని ఈ యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. అమిత్ షా ప్రతినెలా వారం రోజులపాటు ఈ రాష్ట్రంలో పర్యటిస్తారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తెలిపారు. అలాగే పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అసెంబ్లీ ఎన్నికలవరకు ప్రతినెలా రాష్ట్రాన్ని సందర్శిస్తారని ఆయన చెప్పారు. కాగా- అమిత్ షా తమ రాష్ట్రంలో ఇంత పెద్ద ర్యాలీలో పాల్గొని, తమ పార్టీపైనా, తన పైన విమర్శలు చేసినప్పటికీ దీదీ మాత్రం ఒక్క మాటకూడా మాట్లాడకపోవడం విశేషం.