AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ యూనివర్సిటీలో ఓపెన్‌బుక్ పరీక్షలు!

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా పరీక్షలు రద్దయ్యాయి. కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా ఓపెన్ బుక్ విధానంలో పరీక్షలు నిర్వహించేందుకు ఢిల్లీ హైకోర్టు కొన్ని షరతులతో

ఢిల్లీ యూనివర్సిటీలో ఓపెన్‌బుక్ పరీక్షలు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 07, 2020 | 5:05 PM

Share

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా పరీక్షలు రద్దయ్యాయి. కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా ఓపెన్ బుక్ విధానంలో పరీక్షలు నిర్వహించేందుకు ఢిల్లీ హైకోర్టు కొన్ని షరతులతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రశ్నాపత్రాలను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచడంతో పాటు విద్యార్ధులకు విధిగా ఈ-మెయిల్ కూడా చేయాలని జస్టిస్ ప్రతిభా సింగ్ తన తీర్పులో స్పష్టం చేశారు. పరీక్షలు రాసే విద్యార్ధులకు శుభాకాంక్షలు చెప్పిన ధర్మాసనం.. ఢిల్లీ యూనివర్సిటీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్బ(యూజీసీ) తగు మార్గదర్శకాలు అనుసరించాలని కూడా సూచించింది.

సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని.. విద్యార్థులు తమ జవాబు పత్రాలను అప్‌లోడ్ చేసేందుకు మరో గంట అదనంగా సమయం ఇవ్వాలనీ.. ఏవైనా సమస్యలుంటే ఈమెయిల్ చేసే అవకాశం ఇవ్వాలని కూడా కోర్టు సూచించింది. జవాబు పత్రాలు అందినట్టు ప్రతి విద్యార్థికి ఆటో-జనరేటెడ్ ఈమెయిల్ వెళ్లేలా చూడాలని స్పష్టం చేసింది. ఓపెన్ బుక్ విధానంలో పరీక్షలు నిర్వహించాలన్న ఢిల్లీ యూనివర్సిటీ నిర్ణయానికి సవాల్ చేస్తూ కొందరు విద్యార్ధులు ఇటీవల హైకోర్టులో పిటిషన్ వేశారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థుల మాదిరిగానే ఫైనలియర్ విద్యార్థులను కూడా గతేడాది మార్కుల ఆధారంగా ప్రమోట్ చేయాలని వారు విన్నవించారు.

Read More:

జగన్ కీలక నిర్ణయం.. బీటెక్‌ కోర్సుల్లో అప్రెంటిస్‌షిప్‌, ఆనర్స్‌ డిగ్రీ..!

ఇక ప్రతి నియోజకవర్గానికి కరోనా టెస్టింగ్‌ మొబైల్‌ లేబొరేటరీ..!