AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సైకిల్ బెల్స్ దొంగిలించేవాడు : మద్దాలి గిరి

టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న బుద్ధ వెంకన్న గతంలో సైకిల్ బెల్ లను దొంగతనాలు చేసేవాడని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి అన్నారు. బుద్దిలేని బుద్దా వెంకన్న.. మంత్రి వెల్లంపల్లి ఇంట్లో వెండి సింహాలు ఉన్నాయనటం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి వెల్లంపల్లి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్న గరి.. బెజవాడ దుర్గమ్మ వెండి రథంకి నాలుగు అడుగులు దూరంలో బుద్ధ వెంకన్న ఇల్లు ఉందని చెప్పారు. వెండి సింహాలు మాయంపై బుద్దా వెంకన్నను విచారణ చేయాలని […]

టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సైకిల్ బెల్స్ దొంగిలించేవాడు : మద్దాలి గిరి
Venkata Narayana
|

Updated on: Sep 20, 2020 | 3:56 PM

Share

టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న బుద్ధ వెంకన్న గతంలో సైకిల్ బెల్ లను దొంగతనాలు చేసేవాడని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి అన్నారు. బుద్దిలేని బుద్దా వెంకన్న.. మంత్రి వెల్లంపల్లి ఇంట్లో వెండి సింహాలు ఉన్నాయనటం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి వెల్లంపల్లి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్న గరి.. బెజవాడ దుర్గమ్మ వెండి రథంకి నాలుగు అడుగులు దూరంలో బుద్ధ వెంకన్న ఇల్లు ఉందని చెప్పారు. వెండి సింహాలు మాయంపై బుద్దా వెంకన్నను విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో విజయవాడలో 41 ఆలయాలను కూల్చి కనీసం నష్టపరిహారం ఇవ్వలేదని.. ఆనాడు ఎవరైనా దేవాలయాల కూల్చివేతపై మాట్లాడారా..? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. రాజమండ్రి పుష్కరాలలో చంద్రబాబు 30 మందిని బలి తీసుకున్నారని చెప్పారు. ఎక్కడో చిన్న తప్పిదాలు జరిగితే మంత్రి వెల్లంపల్లి, సీఎం జగన్ మీద బురద చల్లుతున్నారని ప్రతిపక్షాలను నిందించారు మద్దాలి గిరి.