బ్యాంక్ కస్టమర్లకు కేంద్రం సలహా.. అలా చేయాలంటూ సూచన..
సైబర్ ఎటాక్స్, అనుమానాస్పద మెయిల్స్ నుంచి బ్యాంక్ కస్టమర్లు తమను తాము రక్షించుకునేలా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన సైబర్ దోస్త్ ట్విట్టర్ వేదికగా కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చింది.
protect your banking account from fraud: నానాటికీ బ్యాంక్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త టెక్నిక్లతో ఖాతాదారుల డబ్బును లూటీ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో బ్యాంక్ కస్టమర్లకు సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. సైబర్ ఎటాక్స్, అనుమానాస్పద మెయిల్స్ నుంచి బ్యాంక్ కస్టమర్లు తమను తాము రక్షించుకునేలా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన సైబర్ దోస్త్ ట్విట్టర్ వేదికగా కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చింది. బ్యాంక్ వినియోగదారులు ఎలప్పుడూ రెండు వేర్వేరు మెయిల్స్ ఉపయోగించాలని పేర్కొంది. (తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్..)
Some cyber criminals compromise victim’s social media account; and contact friends or family members seeking financial assistance on urgent basis on pretext of emergent situation. (1/2)
— Cyber Dost (@Cyberdost) August 24, 2020
”ఎల్లప్పుడూ రెండు వేర్వేరు ఈ-మెయిల్స్ వినియోగించాలి. మీరు విశ్వసించే వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడానికి, ఆర్థిక లావాదేవీలు చేసుకోవడానికి ఒకటి. సోషల్ మీడియా సైట్లలో మీరు ఎంటర్ అయ్యేందుకు మరొకటి ప్రత్యేక ఈ-మెయిల్ను ఉపయోగించండి. ఇందువల్ల స్కామర్లకు మీ అఫీషియల్ అకౌంట్ ఏంటని తెలిసే ఛాన్స్ ఉండదు” అని సైబర్ దోస్ట్ ట్వీట్ చేసింది.
Always make two separate e-mail accounts. One for communicating with people you trust and for your financial transactions. Use separate e-mail account for registering on social networking sites. This will protect your primary account from online stalkers.
— Cyber Dost (@Cyberdost) August 27, 2020
ముఖ్యంగా, స్కామర్లు కస్టమర్లను నమ్మించే విధంగా పలు ఈమెయిల్స్ను ఉపయోగిస్తుంటారు. అందువల్ల వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. ఆర్ధిక లావాదేవీలకు ఉపయోగించే ఎలాంటి ఈ-మెయిల్స్ను సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దని సూచిస్తోంది. అంతేకాకుండా వివిధ వెబ్ బ్రౌజర్లలో ఉన్న AUTO FILL ఆప్షన్ను వినియోగదారులు ఉపయోగించకూడదని.. బ్యాంక్కు సంబంధించిన సివివి, ఎక్స్పైరీ డేట్, కార్డ్ నంబర్ వంటి క్లిష్టమైన సమాచారాన్ని టైప్ చేయాలని కోరింది. కాగా, సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసి.. అనధికారికంగా తమ స్నేహితుల నుంచి ఆర్ధిక సహాయం పొందే అవకాశాలు ఉన్నాయని సైబర్ దోస్త్ గతంలోనే బ్యాంక్ కస్టమర్లను హెచ్చరించిన సంగతి తెలిసిందే.
Always type the information in online forms and not use the auto-fill option on web-browser to fill online forms as these forms may store your personal information such as card number, CVV number, bank account number etc.
— Cyber Dost (@Cyberdost) August 26, 2020