AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బల్దియా ఎన్నికలకు భారీగా నామినేషన్లు.. రెండో రోజు 522 మంది అభ్యర్థులు 580 నామినేషన్లు..

బల్దియా ఎన్నికలకు రెండో రోజు భారీగా నామినేషన్లను వచ్చాయి. నామినేషన్లకు రేపటితో గడువు ముగుస్తుండటంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

బల్దియా ఎన్నికలకు భారీగా నామినేషన్లు..  రెండో రోజు 522 మంది అభ్యర్థులు 580 నామినేషన్లు..
Balaraju Goud
|

Updated on: Nov 19, 2020 | 8:47 PM

Share

బల్దియా ఎన్నికలకు రెండో రోజు భారీగా నామినేషన్లను వచ్చాయి. నామినేషన్లకు రేపటితో గడువు ముగుస్తుండటంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. దాదాపుగా ఇప్పటికే టికెట్‌ ఖరారైన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు వేశారు. గురువారం రోజు 522 మంది అభ్యర్థులు మొత్తం 580 నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. వీటిలో అత్యధికంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థుల నుంచి 195 నామినేషన్లు దాఖలవగా.. భారతీయ జనతాపార్టీకి చెందిన అభ్యర్థులు 140, కాంగ్రెస్‌ నుంచి 68, ఎంఐఎం పార్టీ తరుపున 27, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 47, వైసీపీ 1, సీపీఐ 1, సీపీఎం 4, గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి 15, స్వతంత్ర అభ్యర్థులు 110 మంది నుంచి నామినేషన్లు అందాయని గ్రేటర్ ఎన్నికల అధికారి వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 537 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. రేపు మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల దాఖలుకు గడువు. ముగియనుంది. రేపే చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశముందని అధికారులు బావిస్తున్నారు.