AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరీ దేవుడో.. ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి… అది తిన్నవారి పరిస్థితి ఏంటో మరీ..?

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హోటళ్లు, స్వీట్ షాపుల్లో ఆహార భద్రత ఏ స్థాయిలో ఉందో అద్దం పట్టే ఘోర ఉదంతం ఒకటి వెలుగుచూసింది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ, అపరిశుభ్ర వాతావరణంలో తినుబండారాలు తయారు చేస్తున్న ఒక స్వీట్ హౌస్ బాగోతం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఓరీ దేవుడో.. ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి ఏంటో మరీ..?
Lizard Found In Mixture
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jul 01, 2026 | 9:26 AM

Share

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆహార భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. పట్టణంలోని ప్రముఖ శ్రీ బాలాజీ స్వీట్ హౌస్లో  కొనుగోలు చేసిన ఖారా మిక్చర్‌లో నూనెలో వేయించిన బల్లి ప్రత్యక్షం కావడం స్థానికంగా కలకలం రేపింది. సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ‘శ్రీ బాలాజీ స్వీట్ హౌస్‌’లో ఒక వినియోగదారుడు ఖారా మిక్చర్ కొనుగోలు చేశాడు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి ఆ మిక్చర్‌ను తింటుండగా, అందులో నూనెలో బాగా వేయించబడిన ఒక బల్లి కనిపించింది. అది చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయాందోళనలకు, షాక్‌కు గురయ్యారు. ఒకవేళ గమనించకుండా ఆ మిక్చర్‌ను పూర్తిగా తిని ఉంటే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లేదని వారు వాపోయారు.

నిర్వాహకుడి దురుసు ప్రవర్తన:

మిక్చర్‌లో బల్లి వచ్చిన విషయాన్ని పట్టుకుని బాధితుడు వెంటనే సదరు స్వీట్ హౌస్‌కు వెళ్లాడు. అక్కడ నిర్వాహకుడికి జరిగిన విషయాన్ని వివరించగా.. కనీసం తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పాల్సింది పోయి, బాధ్యతారహితంగా సమాధానమిచ్చాడు. సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా, వినియోగదారుడిపైనే నిర్లక్ష్యంగా మరియు దురుసుగా ప్రవర్తించాడని బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

ఫుడ్ సేఫ్టీ అధికారుల తీరుపై విమర్శలు:

ఈ ఘటన పట్టణంలో కార్చిచ్చులా వ్యాపించడంతో స్థానిక ప్రజలు, వినియోగదారుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా కల్తీ, నాణ్యత లేని ఆహార పదార్థాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయని, అయినప్పటికీ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నామమాత్రంగానే ఉన్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. అధికారుల ఉదాసీనత వల్లే ఇటువంటి యాజమాన్యాలు బరితెగిస్తున్నాయని, ఇది ఫుడ్ పాయిజనింగ్ వంటి పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న శ్రీ బాలాజీ స్వీట్ హౌస్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన సదరు స్వీట్ హౌస్‌ను సీజ్ చేసి, నిర్వాహకులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల ప్రజలు గట్టిగా కోరుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
రోజూ 10 నిమిషాల యోగాతో మీ జీవితాన్ని మార్చుకోండి..ఆరోగ్య ప్రయోజనం
రోజూ 10 నిమిషాల యోగాతో మీ జీవితాన్ని మార్చుకోండి..ఆరోగ్య ప్రయోజనం
ఆధార్ కార్డు ఉంటే ప్రభుత్వం రూ.3 లక్షల లోన్‌ ఇస్తోందా..?
ఆధార్ కార్డు ఉంటే ప్రభుత్వం రూ.3 లక్షల లోన్‌ ఇస్తోందా..?