AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గల్ఫ్ బాధితులకు మాజీ ఎంపీ కవిత అపన్నహస్తం

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నవారికి మాజీ ఎంపీ కవిత చేయూతనందించారు. లాక్ డౌన్ కారణంగా సౌదీలో ఉపాధి కోల్పోయి దిక్కుతోచనిస్థితిలో ఉన్న తెలంగాణ వాసులు స్వస్థలాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు కల్పించారు కవిత. వివిధ జిల్లా లకు చెందిన తెలంగాణ వాసులు బస్సులో 32 మంది ఆదివారం తెల్లవారుజామున స్వస్థలాలకు చేరుకున్నారు.

గల్ఫ్ బాధితులకు మాజీ ఎంపీ కవిత అపన్నహస్తం
Balaraju Goud
|

Updated on: Jun 28, 2020 | 4:44 PM

Share

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నవారికి మాజీ ఎంపీ కవిత చేయూతనందించారు. లాక్ డౌన్ కారణంగా సౌదీలో ఉపాధి కోల్పోయి దిక్కుతోచనిస్థితిలో ఉన్న తెలంగాణ వాసులు స్వస్థలాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు కల్పించారు కవిత. వివిధ జిల్లా లకు చెందిన తెలంగాణ వాసులు బస్సులో 32 మంది ఆదివారం తెల్లవారుజామున స్వస్థలాలకు చేరుకున్నారు. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్లకు చెందిన 32 మంది ఉపాధి కోసం గత కొన్ని నెలలుగా గల్ఫ్ దేశం బహ్రెయిన్ లో ఉపాధి కోసం వెళ్లి చిక్కుకున్నారు. చేసేందుకు పనిలేక సొంత రాష్ట్రానికి చేరుకోలేక నానా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ అనుమతితో బహ్రెయిన్ నుంచి రెండు వారాల క్రితం ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్నారు. విజయవాడ లో 14 రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్ లో ఉన్నావారిని . జూన్ 26 తేదీన క్వారంటైన్ పూర్తయినా ప్రయాణ ఏర్పాట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే విషయాన్ని పలువురు ట్విట్టర్ ద్వారా మాజీ ఎంపీ కవితకు విన్నవించుకున్నారు. దీంతో వెంటనే స్పందించిన మాజీ ఎంపీ, తెలంగాణ వారికోసం విజయవాడ నుంచి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. బస్సులో మాస్కులు, సానిటైజర్ లు అందుబాటులో ఉంచారు. జగిత్యాలకు బస్సు చేరుకోగానే టీఆర్ఎస్ యూత్ జిల్లా అధ్యక్షుడు దావ సురేష్ , నాయకులు భోగ ప్రవీణ్, జాగృతి నాయకులు రాజేందర్ రావు స్వాగతం పలికారు. అడిగిన వెంటనే స్పందించి, బస్సు సౌకర్యం కల్పించిన కవితకి కృతజ్ఞతలు తెలిపారు.