AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత-అమెరికా దేశీయులకు నో ఎంట్రీ…ఈయూ కూటమి

పదిహేను దేశాలకు చెందిన టూరిస్టుల కోసం తమ బోర్డర్లను తెరుస్తున్నామని యూరపియన్ యూనియన్ ప్రకటించింది. అయితే ఇండియా, అమెరికా, రష్యా, బ్రెజిల్ దేశాలవారిని మాత్రం అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. కరోనా వైరస్ రాకాసి..

భారత-అమెరికా దేశీయులకు నో ఎంట్రీ...ఈయూ కూటమి
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 01, 2020 | 4:22 PM

Share

పదిహేను దేశాలకు చెందిన టూరిస్టుల కోసం తమ బోర్డర్లను తెరుస్తున్నామని యూరపియన్ యూనియన్ ప్రకటించింది. అయితే ఇండియా, అమెరికా, రష్యా, బ్రెజిల్ దేశాలవారిని మాత్రం అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. కరోనా వైరస్ రాకాసి ప్రబలంగా ఉన్న ఈ దేశాల విజిటర్లకు నో ఎంట్రీ అని పేర్కొంది. అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, జార్జియా, జపాన్, మాంటినీగ్రో, మొరాకో, న్యూజిలాండ్ తదితర 15 దేశాల వారికి పర్మిషన్ ఇస్తున్నట్టు తమ జాబితాలో ఈ కూటమి వెల్లడించింది. చైనా విషయానికి వస్తే.. తమ దేశాల టూరిస్టులను ఆ దేశం అనుమతిస్తేనే.. చైనీయులకు తమ సరిహద్దులు ఓపెన్ చేస్తామని షరతు విధించారు. ఈ లిస్టును ప్రతి 14 రోజులకొకసారి అప్ డేట్ చేస్తుంటారు. కొత్త దేశాలను చేర్చడమొ, లేక మరి కొన్ని దేశాలను ‘పక్కన పెట్టడమో’ చేస్తుంటారు. కరోనా వైరస్ ని ఆయా దేశాలు కంట్రోల్ చేస్తున్నాయా లేదా అన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుంది.

ఈయూ నుంచి విజిటర్లను నిషేధిస్తున్నట్టు అమెరికా గత మార్చిలోనే ప్రకటించింది. ప్రతి ఏడాదీ సుమారు కోటిన్నర మంది అమెరికన్లు యూరప్ దేశాలను సందర్శిస్తుంటారు. యూరప్ టూరిజం ఇండస్ట్రీలో అమెరికాకు భారీ వాటా ఉంది. అయితే అమెరికాలో కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతోంది. దీంతో ఈయూ భయపడుతోంది.