AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eluru Disease: ఏలూరు వాసులకు ఊరటనిచ్చే గుడ్ న్యూస్.. తగ్గుతున్న వింత వ్యాధి ప్రభావం..!

ఏలూరు వాసులకు ఊరటను ఇచ్చే గుడ్ న్యూస్. క్రమక్రమంగా వింత వ్యాధి ప్రభావం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. గత రెండు రోజులుగా కొత్తగా...

Eluru Disease: ఏలూరు వాసులకు ఊరటనిచ్చే గుడ్ న్యూస్.. తగ్గుతున్న వింత వ్యాధి ప్రభావం..!
Ravi Kiran
|

Updated on: Dec 08, 2020 | 6:24 PM

Share

Eluru Disease: ఏలూరు వాసులకు ఊరటను ఇచ్చే గుడ్ న్యూస్. క్రమక్రమంగా వింత వ్యాధి ప్రభావం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. గత రెండు రోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ నెల 5వ తేదీన(తొలి రోజు) 83 మంది వింత వ్యాధి కారణంగా హాస్పిటల్ పాలవ్వగా.. 6న 242 మంది, 7న 180 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇక ఈ రోజు అయితే ఇప్పటివరకు కేవలం 50 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

రెండు రోజులుగా హోరెత్తిన కాల్ సెంటర్లకు.. గడిచిన రెండు గంటల్లో కేవలం ఒక్క కాల్ మాత్రమే వచ్చిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రోగుల నుంచి సేకరించిన నమూనాల్లో అధిక మోతాదులో లెడ్, నికెల్ అవశేషాలు ఎలా వచ్చాయన్న విషయాలను తెలుసుకునేందుకు ఢిల్లీ ఎయిమ్స్, ఎన్ఐఎన్ బృందం నీరు, ఆహార శాంపిల్స్‌ను సేకరించింది.

కాగా, ఈ వింత వ్యాధి వల్ల ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 550కు చేరింది. వీరిలో 77 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మరో 24 మందిని గుంటూరు, విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఇక 448 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. మూర్ఛపోయి ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతూ శ్రీధర్‌ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.