AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళా ఓటర్లకు సానిటరీ ప్యాడ్స్.. ఈసీ వినూత్న నిర్ణయం

మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వారిలో చైతన్యం తెచ్చేందుకు ఎన్నికల కమిషన్ వినూత్న నిర్ణయం తీసుకుంది. పోలింగ్ బూత్‌కు వచ్చే మహిళలకు సానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలని ఈసీ భావిస్తోంది. ఈ నిర్ణయం దిశగా.. ఏప్రిల్ 29న జరిగే నాలుగో దశ ఎన్నికల్లో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. ‘‘ముంబయిలోని సఖి మత్దాన్ కేంద్రాలలో ఉన్న మహిళా ఓటర్లకు ఈ నెల 29న  సానిటరీ ప్యాడ్స్ ఇవ్వబోతున్నాం. పోలింగ్ బూత్‌కు వచ్చి మహిళలు తమ ఓటు […]

మహిళా ఓటర్లకు సానిటరీ ప్యాడ్స్.. ఈసీ వినూత్న నిర్ణయం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 25, 2019 | 12:18 PM

Share

మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వారిలో చైతన్యం తెచ్చేందుకు ఎన్నికల కమిషన్ వినూత్న నిర్ణయం తీసుకుంది. పోలింగ్ బూత్‌కు వచ్చే మహిళలకు సానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలని ఈసీ భావిస్తోంది. ఈ నిర్ణయం దిశగా.. ఏప్రిల్ 29న జరిగే నాలుగో దశ ఎన్నికల్లో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. ‘‘ముంబయిలోని సఖి మత్దాన్ కేంద్రాలలో ఉన్న మహిళా ఓటర్లకు ఈ నెల 29న  సానిటరీ ప్యాడ్స్ ఇవ్వబోతున్నాం. పోలింగ్ బూత్‌కు వచ్చి మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు మేము ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని ఎలక్షన్ కమిషన్ అధికారి ఒకరు తెలిపారు. కాగా ముంబయిలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సఖి మత్దాన్ కేంద్రాలు ఉన్నాయి.