Dussehra Celebrations : దేశవ్యాప్తంగా దసరా సంబరాలు సంప్రదాయరీతిలో జరుపుకున్నారు. పంజాబ్లోని లూధియానాలో రావణ దహనం కార్యక్రమం కలర్ఫుల్గా జరిగింది. దసరా గ్రౌండ్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. కరోనా ప్రోటోకాల్ ప్రకారం పరిమిత స్థాయిలోనే జనానికి అనుమతిచ్చారు.
లూధియానాలో 30 అడుగుల రావణుడి బొమ్మను దహనం చేశారు. విజయదశమి వేడుకలకు సూచనగా టపాసులు పేల్చారు. జనం ఆన్లైన్లో వీక్షించేందుకు అధికార యంత్రాగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
#WATCH Punjab: 30-feet tall effigy of Ravan being burnt at Daresi Dussehra Ground in Ludhiana, on #Dussehra today. pic.twitter.com/7QsNiyVrUN
— ANI (@ANI) October 25, 2020
ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో కూడా రావణదహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రావణుడితో పాటు మేఘనాథ్ , కుంభకర్ణుడి బొమ్మలను దహనం చేశారు. విజయదశమి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.
#WATCH: Effigy of Ravan being burnt at Sector 21 in Noida on #Dussehra pic.twitter.com/E9n7R1OtRj
— ANI UP (@ANINewsUP) October 25, 2020