తిరిగి ప్రారంభమైన దుబాయ్ విమాన సర్వీసులు

సెప్టెంబర్ 4‌న జైపూర్-దుబాయ్ విమానంలో ఒక ప్రయాణికుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రెండోసారి ఇలా జరిగిన నేపథ్యంలో అక్టోబర్ 2 వరకు 15 రోజులపాటు దుబాయ్‌కు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు నిలిపివేశారు...

తిరిగి ప్రారంభమైన దుబాయ్ విమాన సర్వీసులు
Follow us

|

Updated on: Sep 18, 2020 | 11:50 PM

దుబాయ్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.  శనివారం నుంచి సాధారణ షెడ్యూల్ ప్రకారం అన్ని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు నడుస్తాయని ఎయిర్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. భారత్ నుంచి దుబాయ్‌కు విమాన రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది.

సెప్టెంబర్ 4‌న జైపూర్-దుబాయ్ విమానంలో ఒక ప్రయాణికుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రెండోసారి ఇలా జరిగిన నేపథ్యంలో అక్టోబర్ 2 వరకు 15 రోజులపాటు దుబాయ్‌కు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు నిలిపివేశారు. ఈ వివరాలను దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఇటీవల వెల్లడించింది. అయితే శనివారం నుంచి షెడ్యూల్ ప్రకారం అన్ని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు నడుస్తాయని ఎయిర్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకటించింది. కరోనా మార్గదర్శకాలను పక్కగా పాటిస్తామని చెప్పింది.

కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 25 నుంచి నిలిపివేసిన అంతర్జాతీయ విమాన సర్వీసులను ఇంకా పునరుద్ధరించలేదు. అయితే విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను దేశానికి తరలించేందుకు, దేశంలోని విదేశీయులను ఇతర దేశాలకు తరలించేందుకు వందే భారత్ మిషన్ కింద ప్రత్యేక విమాన సర్వీసులను కేంద్రం నడుపుతున్నది. అలాగే కొన్ని దేశాలు కూడా భారత్‌కు ప్రత్యేక విమానాలు నడుపుతున్నాయి.