AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా పరీక్షల అర్హతపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కోవిడ్ టెస్టు కోసం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందని చెప్పింది. తనకు కరోనా పాజిటివా లేక నెగెటివా అనే విషయాన్ని..

కరోనా పరీక్షల అర్హతపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Pardhasaradhi Peri
|

Updated on: Sep 08, 2020 | 9:48 PM

Share

కోవిడ్ టెస్టు కోసం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందని చెప్పింది. తనకు కరోనా పాజిటివా లేక నెగెటివా అనే విషయాన్ని తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. వారం రోజులుగా ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంపై పట్ల కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా లక్షణాలు ఉంటేనే ఇప్పటి వరకు ఢిల్లీలో పరీక్షలు నిర్వహించేవారు. లక్షణాలు లేని వాళ్లు టెస్ట్ చేయించుకోవాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కంపల్సరీగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పుతో నిబంధనలు మారనున్నాయి. అంతేకాదు, ప్రతి రోజు 2 వేల పరీక్షలు నిర్వహించే వెసులుబాటును ప్రైవేట్ ఆసుపత్రులకు కల్పించాలని హైకోర్టు తెలిపింది.