AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నివార్ ఇలా తాకింది… ఎలా బీభత్సం సృష్టిస్తోంది… తుఫాన్ ప్రతాపం ఎంత..?

నివర్‌ తుఫాన్‌ తీరం దాటింది. రాత్రి 11.30కి మొదలైన ఈ ప్రక్రియ తెల్లవారుజామున రెండున్నర వరకు సాగింది. నివర్‌ తీరం దాటే సమయంలో పెను గాలులు వీచాయి. పుదుచ్చేరి, చెన్నై మధ్య తుఫాను కేంద్రం ఉందని అధికారులు తెలిపారు.

నివార్ ఇలా తాకింది... ఎలా బీభత్సం సృష్టిస్తోంది... తుఫాన్ ప్రతాపం ఎంత..?
Sanjay Kasula
|

Updated on: Nov 26, 2020 | 8:01 AM

Share

నివర్‌ తుఫాన్‌ తీరం దాటింది. రాత్రి 11.30కి మొదలైన ఈ ప్రక్రియ తెల్లవారుజామున రెండున్నర వరకు సాగింది. నివర్‌ తీరం దాటే సమయంలో పెను గాలులు వీచాయి. పుదుచ్చేరి, చెన్నై మధ్య తుఫాను కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నివర్‌.. అతితీవ్ర తుఫాన్ నుంచి తీవ్ర తుఫాన్‌గా మారింది. మరో ఆరు గంటల్లో తుఫాన్‌గా మారనుంది నివర్.

నివర్‌ తాకిడికి తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పుదుచ్చేరిలో లక్ష మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల కోసం 50 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కేటాయించారు. తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలో 30 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు మోహరించాయి. విజయవాడ, కటక్, త్రిస్సూర్‌లో మరో 20 బృందాలు సిద్దంగా ఉంచామని ఎన్టీఆర్‌ఎఫ్‌ తెలిపింది.

ఇక నివర్‌ ఎఫెక్ట్‌తో ఎక్కడికక్కడ చెట్లు, కరెంటు స్తంభాలు కూలుతున్నాయి. చెన్నైలోని ఐస్‌ హౌస్ దగ్గర గాలి తీవ్రతకు చెట్టు కూలి ఒకరు మృతిచెందారు. తరువల్లూరులో గోడ కూలి మరొకరు బలయ్యారు. కడలూరులో ఇళ్లు కూలి మహిళ చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

నివర్ తుఫాన్ కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. తిరుపతిలో భారీ ఈదురుగాలులలో కూడిన వర్షం కురిసింది. సత్యవేడులోని పలు మండలాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. తుఫాన్ కారణంగా కడప జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చిత్తూరు జిల్లాలోనూ విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు అధికారులు.