AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేటిఎం కెవైసి అంటూ రూపాయి డిపాజిట్ చేయమంటారు.. ఆపై..

పేటిఎం కోసం కెవైసి అప్డేట్ అంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. జార్ఖండ్ రాష్ట్రం జంతార జిల్లా కేంద్రంగా ఈ మోసాలు జరుగుతున్నట్లు గుర్తించామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. వీళ్లంతా “పేటియం ఆప్ డౌన్లోడ్ పేరుతో డెబిట్ క్రెడిట్ కార్డుల నుండి ఒక రూపాయి డిపాజిట్ చెయ్యాలి అని కోరుతారు.. ఆ తరవాత వారి రిమోట్ యాక్సెస్ తో లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు. వినయ్ శర్మ అనే బాధితుడి నుంచి 4లక్షల […]

పేటిఎం కెవైసి అంటూ రూపాయి డిపాజిట్ చేయమంటారు.. ఆపై..
Venkata Narayana
|

Updated on: Oct 13, 2020 | 4:37 PM

Share

పేటిఎం కోసం కెవైసి అప్డేట్ అంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. జార్ఖండ్ రాష్ట్రం జంతార జిల్లా కేంద్రంగా ఈ మోసాలు జరుగుతున్నట్లు గుర్తించామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. వీళ్లంతా “పేటియం ఆప్ డౌన్లోడ్ పేరుతో డెబిట్ క్రెడిట్ కార్డుల నుండి ఒక రూపాయి డిపాజిట్ చెయ్యాలి అని కోరుతారు.. ఆ తరవాత వారి రిమోట్ యాక్సెస్ తో లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు. వినయ్ శర్మ అనే బాధితుడి నుంచి 4లక్షల 29 వేలు కొట్టేశారు. జార్ఖండ్ చెందిన నంకు మండల్ అలియాస్ రాహుల్ , రాజేష్ మండల్, శివశేక్తి కుమార్ అలియాస్ అమిత్ బర్నల్, గౌరవ్ అరుణ్ , దిల్ ఖుష్ కుమార్ సింగ్ లను అరెస్ట్ చేశాం. నిందితుల నుంచి 1లక్ష 47 వేల నగదు, మొబైల్ ఫోన్లు డెబిట్, క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నాం. నింధితులంతా సైబర్ నేరాలు చెయ్యడం లో ఆరితేరారు”. అని సీపీ వెల్లడించారు.

Follow Us