కరోనాకు వ్యాక్సిన్… హైదరాబాద్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ !

ప్రపంచ దేశాలను గడగడ లాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టేందుకు అన్ని దేశాలు సమాయత్తమౌతున్నాయి.మన దేశంలో కూడా కరోనాకు విరుగుడు కనిపెట్టేందుకు ట్రయిల్స్ స్టార్ట్ అయ్యాయి. అదికూడా...

కరోనాకు వ్యాక్సిన్... హైదరాబాద్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ !
Follow us

|

Updated on: Mar 07, 2020 | 2:10 PM

కొవిడ్- 19: మొత్తం 89 దేశాలకు పాకింది ఈ మహమ్మారి. మన దేశంలో ఇప్పటి వరకు 31పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీన్ని అంతం చేసే మందు ఇప్పటి వరకూ రాలేదు. మున్ముందు వస్తుందేమో కానీ…ప్రస్తుతానికైతే లేదు. కేవలం నియంత్రించడం తప్ప. ప్రపంచ దేశాలను గడగడ లాడిస్తున్న ఈ మహమ్మారి బారిన పడి చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమౌతోంది. దీని ప్రభావంతో మదుపర్లకు సంబంధించిన లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అందుకే ఎంత వీలైతే అంత త్వరగా దీనికి వ్యాక్సిన్ కనిపెట్టేందుకు అన్ని దేశాలు సమాయత్తమౌతున్నాయి. మన దేశంలో కూడా కరోనాకు విరుగుడు కనిపెట్టేందుకు ట్రయిల్స్ స్టార్ట్ అయ్యాయి. అదికూడా మన హైదరాబాద్‌లోనే ఇందుకు సంబంధించిన రీసెర్చ్ మొదలైనట్లు సమాచారం.

ఎబోలాకున్న లక్షణాలే కరోనాకు ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. రెండు వైరస్ లక్షణాలు ఒక్కటిగా ఉండడంతో…గతంలో కనిపెట్టిన ఎబోలా వ్యాక్సిన్‌ డేటాతో కరోనాకు మందు కనిపెట్టవచ్చని మన వైద్యులు అంటున్నారు. ఈమేరకు హైదరాబాద్ కేంద్రంగా ఫార్మా ఇండస్ట్రీలో ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. రెమ్‌డెసీవర్‌ ఫార్మా డేటాతో కరోనాకు మందును సిద్ధం చేస్తున్నారు. ఈ పార్మా కెమికల్‌ను ఎబోలా వ్యాప్తి చెందినప్పుడు ఆఫ్రికాలో ప్రయోగించారు. ఇప్పుడు కరోనాకు ఇదే డేటా సరిపోతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈమేరకు గిలియడ్ సైన్సెస్‌ అనే కంపెనీ 15మంది శాస్త్రవేత్తల బృందంతో కలిసి కరోనాకు ఔషధాన్ని తయారు చేసే పనిలో ఉంది.

మన హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కరోనాకు మందు కనిపెట్టే పనిలో బిజీగా ఉంది. ఎబోలా యాంటీవైరల్ డ్రగ్ పద్దతిలో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం 10 నుంచి 50గ్రాముల మందును తయారు చేసి ఉంచుతామని,…మెడికల్ ట్రయల్స్‌లో సక్సెస్ అయితే…బల్క్‌గా విడుదల చేస్తామని ఐఐసీటీ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపినట్లు సమాచారం. ఇక అన్నీ పరీక్షలు పూర్తై, ఒకసారి మెడిసిన్ వచ్చిందంటే..చైనాను వణికించిన వైరస్‌కు హైదరాబాద్‌లో ఔషదం తయారైనట్లే.